AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prashant Kishor: కాంగ్రెస్‌లో చేరేందుకు నిరాకరించిన ప్రశాంత్ కిశోర్.. ఎందుకో తెలుసా?

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రెస్‌లో చేరడానికి నిరాకరించారు. ఈ విషయాన్ని ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ రణదీప్‌ సూర్జేవాలా స్వయంగా ధృవీకరించారు.

Prashant Kishor: కాంగ్రెస్‌లో చేరేందుకు నిరాకరించిన ప్రశాంత్ కిశోర్.. ఎందుకో తెలుసా?
Prashant Kishor
Balaraju Goud
|

Updated on: Apr 26, 2022 | 4:15 PM

Share

Prashant Kishor Declined: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రెస్‌లో చేరడానికి నిరాకరించారు. ఈ విషయాన్ని ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ రణదీప్‌ సూర్జేవాలా స్వయంగా ధృవీకరించారు. ప్రశాంత్‌కిశోర్‌ను కాంగ్రెస్‌లో చేరాలని సోనియాగాంధీ స్వయంగా ఆహ్వానించారని సూర్జేవాలా తెలిపారు. అయితే అందుకు పీకే నిరాకరించినట్టు వెల్లడించారు. 2024 ఎన్నికల కోసం ఏర్పాటు చేస్తున్న ఎంపర్డ్‌ కమిటీలో సభ్యుడిగా ఉండాలని పీకేను సోనియాగాంధీ కోరారు. కాంగ్రెస్‌కు సలహాదారుగా మాత్రమే ఉండడానికి పీకే అంగీకరించారు.

ప్రశాంత్‌ కిశోర్‌ చేరికపై నియమించిన కమిటీ సోమవారం సోనియాగాంధీతో సమావేశమయ్యింది. సీనియర్‌ నేతలు కూడా పీకే కాంగ్రెస్‌లో చేరికను వ్యతిరేకిస్తూ సోనియాకు తమ నిర్ణయాన్ని తెలిపారు. కాంగ్రెస్‌కు సలహాలు , సూచనలు ఇవ్వడానికి ముందుకొచ్చిన ప్రశాంత్‌ కిశోర్‌కు ధన్యవాదాలు అంటూ సూర్జేవాలా ట్వీట్‌ చేశారు.

ప్రశాంత్ కిషోర్‌తో చర్చ మరియు ప్రజెంటేషన్ తర్వాత, కాంగ్రెస్ అధ్యక్షుడు ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ 2024ని ఏర్పాటు చేసి, గ్రూప్‌లో భాగమై పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు, కానీ ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రశాంత్ కిశోర్ నిరాకరించారు. ఈ మేరకు ఆయన స్వయంగా ట్వీట్ చేశారు. EAGలో భాగంగా పార్టీలో చేరాలని కోరారని, అయితే ఎన్నికల బాధ్యతలు మాత్రమే తీసుకుంటానని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఉదారమైన ప్రతిపాదనను నేను తిరస్కరించాను. నా వినయపూర్వకమైన అభిప్రాయం ప్రకారం, పరివర్తన సంస్కరణల ద్వారా లోతుగా పాతుకుపోయిన నిర్మాణ సమస్యలను పరిష్కరించడానికి నా కంటే పార్టీకి నాయకత్వం సమష్టి సంకల్పం అవసరమని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు.

Read Also…  Blast: పాకిస్థాన్‌లోని కరాచీలో పేలుడు.. ఇద్దరు చైనీయులతోపాటు నలుగురు మృతి..