PM Modi: లోక్సభలో ప్రధాని మోదీ ప్రసంగం.. పశ్చిమాసియా యుద్ధంపై బిగ్ స్టేట్మెంట్
లోక్సభలో ప్రధాని మోదీ ప్రసంగం పశ్చిమాసియా యుద్ధంపై సభలో ప్రధాని స్టేట్మెంట్ పశ్చిమాసియాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది-మోదీ మూడు వారాలుగా యుద్ధం కొనసాగుతోంది యుద్ధంతో ప్రపంచంపై తీవ్ర ప్రభావం ఉంది భారత్కు ఈ యుద్ధం ఎన్నో సవాళ్లు తీసుకొచ్చింది-మోదీ యుద్ధంలో చిక్కుకున్న భారతీయులను కాపాడడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం చాలా దేశాధినేతలతో నేను మాట్లాడాను-మోదీ 3 లక్షల 75 వేలమందిని సురక్షితంగా భారత్కు తరలించాం ఇరాన్ నుంచి 1000 మందిని తరలించాం-మోదీ
లోక్సభలో ప్రధాని మోదీ ప్రసగించారు. పశ్చిమాసియా యుద్ధంపై సభలో ప్రధాని కీలక స్టేట్మెంట్ ఇచ్చారు. పశ్చిమాసియాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. మూడు వారాలుగా యుద్ధం కొనసాగుతోందని అన్నారు. యుద్ధంతో ప్రపంచంపై తీవ్ర ప్రభావం ఉంది. భారత్కు ఈ యుద్ధం ఎన్నో సవాళ్లు తీసుకొచ్చిందని ప్రధాని మోదీ తెలిపారు. యుద్ధంలో చిక్కుకున్న భారతీయులను కాపాడడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. చాలా దేశాధినేతలతో తాను మాట్లాడానని.. 3 లక్షల 75 వేల మందిని సురక్షితంగా భారత్కు తరలించామని చెప్పారు. ఇరాన్ నుంచి 1000 మందిని తరలించామని స్పష్టం చేశారు.
దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా చూస్తున్నాం. హర్మూజ్ నుంచి మరిన్ని నౌకలు భారత్కు వస్తున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. రైల్వేల విద్యుదీకరరణతో 180 కోట్ల డీజిల్ ఆదా అయిందన్నారు. ప్రపంచానికి ఆర్ధిక మాంద్యం ముప్పు పొంచి ఉంది. భారత్పై మాంద్యం ప్రభావం లేకుండా చూస్తున్నామని ఆయన అన్నారు.
కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం
మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !
ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి
దారిచ్చిన వ్యక్తికి ఏనుగు థ్యాంక్స్ చెప్పిందిలా..
తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్ చేస్తే..
అసెంబ్లీని షేక్ చేసిన 'స్నేక్'..
బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే

