
భారతదేశంలో సేంద్రీ వ్యవసాయం వైపు రైతుల ప్రయాణం వేగంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ.. కీలక సందేశాన్ని పంచుకున్నారు.. భారతదేశం – సేంద్రీయ వ్యవసాయం… ముందుకు సాగడానికి మార్గం.. అంటూ పేర్కొన్నారు. సేంద్రీయ వ్యవసాయం, మనందరికీ తెలిసినట్లుగా, సింథటిక్ రసాయనాలు లేకుండా పంటలను పండించడానికి భారతదేశ సాంప్రదాయ జ్ఞాన వ్యవస్థలు, ఆధునిక పర్యావరణ సూత్రాల నుంచి తీసుకోబడింది. ఇది మొక్కలు, చెట్లు – పశువులు సహజ జీవవైవిధ్యానికి మద్దతు ఇవ్వడానికి కలిసి జీవించే వైవిధ్యభరితమైన పొలాలను ప్రోత్సహిస్తుంది. బాహ్య ఇన్పుట్ల కంటే వ్యవసాయ అవశేషాలను రీసైక్లింగ్ చేయడం, మల్చింగ్, వాయువు ద్వారా నేల ఆరోగ్యాన్ని పెంచడంపై ఈ విధానం ఆధారపడి ఉంటుందని ప్రధాని మోదీ సుధీర్ఘ కథనంలో వివరించారు.
సేంద్రీయ వ్యవసాయం ప్రాధాన్యం రోజురోజుకు పెరుగుతున్న ఈ సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక ముఖ్యమైన సందేశాన్ని దేశంతో పంచుకున్నారు. కోయంబత్తూరులో నవంబర్ 19న జరిగిన సౌత్ ఇండియా నేచురల్ ఫార్మింగ్ సమ్మిట్ 2025లో పాల్గొన్న ప్రధాని మోదీ.. అక్కడి అనుభవాన్ని సుధీర్ఘంగా లింక్డిన్ ఖాతాలో పోస్ట్ చేశారు. భారత వ్యవసాయం భవిష్యత్తు సేంద్రీయ వ్యవసాయంతోనే వెలుగొందుతుందని చెప్పారు.
ప్రధాని మోదీ పాల్గొన్న ఈ శిఖరాగ్ర సదస్సులో తమిళనాడుతో పాటు దక్షిణ భారతంలోని పలు రాష్ట్రాల రైతులు, శాస్త్రవేత్తలు, ఎఫ్పీవో నేతలు, వ్యవసాయ వ్యవస్థాపకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు తమ అనుభవాలు, కొత్త పద్ధతులు, జీవన ప్రయాణాలు పంచుకున్నారు.
‘‘కొద్ది వారాల క్రితం తమిళనాడులోని రైతుల ఆహ్వానంతో ఆయన ఈ సమ్మిట్లో పాల్గొన్నాను.. సహజ వ్యవసాయాన్ని అనుసరిస్తున్న రైతులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ వ్యాపారవేత్తలు, ఎఫ్పీవో నాయకులను కలసి వారి ప్రయాణాలను తెలుసుకున్నాను.. వివిధ నేపథ్యాల నుంచి వచ్చిన ఈ వ్యక్తులందరినీ ఏకం చేస్తున్న అంశం.. మట్టి ఆరోగ్యం, స్థిరత్వం, గ్రామీణ అభివృద్ధి, సుస్థిర వ్యవసాయంపై వారి నిబద్ధత అపారం..’’ అంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో యువ రైతులు తమ అనుభవాలు, కొత్త పద్ధతులు, జీవన ప్రయాణాలను పంచుకున్నారని మోదీ చెప్పారు. సమ్మిట్లో ఆయన కలిసిన కొందరి జీవిత కథలను కూడా ప్రధాన మంత్రి వివరించారు..
‘‘నేను అక్కడ కలిసిన వ్యక్తులు వేర్వేరు నేపథ్యాలకు చెందినవారు.. కానీ ఒక విషయం ఉమ్మడిగా ఉంది: నేల ఆరోగ్యం, స్థిరత్వం, సమాజ అభ్యున్నతి.. లోతైన సంస్థ భావన పట్ల పూర్తి నిబద్ధత.’’ అంటూ మోదీ పేర్కొన్నారు.
ఈ ఉదాహరణలు భారత యువత, రైతులు, శాస్త్రవేత్తలు కలిసి వ్యవసాయ రంగాన్ని ఎలా మార్చుతున్నారో చూపుతున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. అందరూ ఒకే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. మట్టి ఆరోగ్యం, స్థిరత్వం, సామూహిక అభివృద్ధి, సుస్థిర ఆర్థికతపై వారి నిబద్ధత విశేషం.. అని కొనియాడారు..
ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్, కిసాన్ క్రెడిట్ కార్డ్ విస్తరణ, పీఎం–కిసాన్, ఎగుమతులకు ప్రోత్సాహం వంటి చర్యలు సేంద్రీయ వ్యవసాయాన్ని మరింత బలపరుస్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళా రైతులు, మిల్లెట్ల ప్రోత్సాహం ఈ ఉద్యమాన్ని మరొక దిశగా తీసుకెళ్తున్నాయని అన్నారు.
రసాయన ఎరువుల వాడకం పెరిగి నేల సారానికి జరిగిన నష్టాన్ని నివారించడంలో పంచగవ్య, జీవామృతం, బీజామృతం, మల్చింగ్ వంటి పద్ధతులు కీలకమని మోదీ గుర్తుచేశారు. రైతులకు ‘‘ఒక ఎకరం–ఒక సీజన్” విధానంతో సహజ వ్యవసాయం ప్రారంభించాలని మోదీ సూచించారు.
తన సందేశం చివర్లో, సహజ వ్యవసాయం గురించి పనిచేస్తున్న బృందాలు, స్టార్టప్లు, ఎఫ్పీవోలు ఉంటే తనతో పంచుకోవాలని ప్రజలను ప్రధాన మంత్రి కోరారు. భారత వ్యవసాయం – అనుబంధ రంగాల సుస్థిరాభివృద్ధి కోసం సమిష్టిగా కృషి చేయాల్సిన సమయం ఇదని.. దీనికోసం అందరూ నడుంబిగించాలని కోరారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..