Anti-Paper Leak Bill 2026: యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం..

యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో సభ్యులు బిల్లుకు ఆమోదం తెలిపారు. కాగా, విపక్షాల సవరణలు విగిపోయాయి.. బిల్లు ఆమోదం అనంతరం విపక్షాల ఆందోళనల మధ్య లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. పరీక్షా పేపర్ లీక్ కు పాల్పడితే.. కఠిన చర్యలు తీసుకునేలా Anti-Paper Leak Bill 2026 రూపొందించారు.

Anti-Paper Leak Bill 2026: యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం..
Anti Paper Leak Bill Pass

Updated on: Jul 29, 2026 | 3:59 PM

యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో సభ్యులు బిల్లుకు ఆమోదం తెలిపారు. కాగా, విపక్షాల సవరణలు విగిపోయాయి.. బిల్లు ఆమోదం అనంతరం విపక్షాల ఆందోళనల మధ్య లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. పరీక్షా పేపర్ లీక్ కు పాల్పడితే.. కఠిన చర్యలు తీసుకునేలా Anti-Paper Leak Bill 2026 రూపొందించారు.  అంతకుముందు యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లుపై లోక్ సభలో సుధీర్ఘ చర్చ జరిగింది. పేపర్ లీక్ విషయంతోపాటు.. విద్యార్థుల ఆందోళనలపై చర్యలు, సవరణలపై విపక్షలు ప్రశ్నలు సంధించాయి..

వందేమాతరం సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

వందేమాతరం సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం లభించింది. అనంతరం రాజ్యసభ కూడా రేపటికి వాయిదా పడింది.

రాహుల్ వ్యాఖ్యలు.. లోక్ సభలో రచ్చ..

యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లుపై చర్చలో విపక్ష నేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై లోక్‌సభలో రచ్చ జరిగింది. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదేశాల మేరకే విద్యార్ధులపై కాల్పులు జరిపారని రాహుల్‌ ఆరోపించారు. పెల్లెట్‌ గన్స్‌ ప్రయోగంతో విద్యార్ధులకు తీవ్ర గాయాలయ్యాయని అన్నారు. దీనికి అమిత్‌షానే కారణమన్నారు. పేపర్‌ లీక్‌ బిల్లుపై చర్చలో ప్రధాని మోదీ, అమిత్‌షా ఎందుకు పాల్గొనడం లేదని ప్రశ్నించారు. అయితే రాహుల్‌ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం చెప్పారు. అమిత్‌షా చేసిన ఆరోపణలకు రాహుల్‌ ఆధారాలు చూపించాలని డిమాండ్‌ చేశారు. అమిత్‌షాకు క్షమాపణలు చెప్పిన తరువాతే సభలో రాహుల్‌ మాట్లాడాలని అన్నారు. అయితే అమిత్‌షాపై తన వ్యాఖ్యలను రాహుల్‌ సమర్ధించుకున్నారు. ఢిల్లీ పోలీసులు కేంద్ర హోంశాఖ కిందే పనిచేస్తారని అన్నారు.

కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ కౌంటర్..

లోక్‌సభలో రాహుల్‌ వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌. ఏ మంత్రి కూడా కాల్పులు జరపాలని ఆదేశాలు ఇవ్వరని అన్నారు. జులై 21న ప్రధాని మోదీ నివాసం దగ్గర రాహుల్‌ ఎందుకు ధర్నా చేశారో తెలియదన్నారు. చాలా బాధ్యతారాహిత్యంగా రాహుల్‌ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us