ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణించిన తర్వాత నోయెల్ టాటా టాటా ట్రస్ట్ల ఛైర్మన్గా ఏకగ్రీవంగా నియమితులయ్యారు. నోయెల్ టాటా టాటా స్టీల్ అండ్ వాచ్ కంపెనీ టైటాన్ వైస్ ఛైర్మన్గా పనిచేస్తున్నాడు. రతన్ టాటా సవతి తల్లి కుమారుడే ఈ నోయెల్ టాటా.. అతను 2000 సంవత్సరంలోనే టాటా గ్రూప్లో చేరారు. టాటా ట్రస్ట్లో ప్రస్తుతం వేణు శ్రీనివాసన్, విజయ్ సింగ్, మెహ్లీ మిస్త్రీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా ఉన్నారు. రతన్ టాటా తమ్ముడు జిమ్మీ కుటుంబ వ్యాపారంలో పాలుపంచుకోలేదు. దక్షిణ ముంబైలోని కొలాబాలో ఓ చిన్న అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. 1937లో సాంప్రదాయ పార్సీ కుటుంబంలో జన్మించిన రతన్ టాటా తన 10వ ఏటా అతని తల్లిదండ్రులు నావల్-సూని టాటా విడాకులు తీసుకున్న తర్వాత అతని అమ్మమ్మ వద్ద పెరిగారు.