ఏ మధ్యవర్తి లేడు..! పాక్‌తో సీజ్‌ఫైర్‌పై పార్లమెంట్‌లో జైశంకర్‌ కీలక స్టేట్‌మెంట్‌

ఉగ్రవాదానికి భారతదేశం జీరో టాలరెన్స్ పాలసీ అనుసరిస్తుందని, పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. ఐరాస భద్రతా మండలి లో భారతదేశ వైఖరిని అంగీకరించిందని, పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నట్లు బయటపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

ఏ మధ్యవర్తి లేడు..! పాక్‌తో సీజ్‌ఫైర్‌పై పార్లమెంట్‌లో జైశంకర్‌ కీలక స్టేట్‌మెంట్‌
Jai Shankar And Trump

Updated on: Jul 28, 2025 | 7:22 PM

ఆపరేషన్ సిందూర్ పై లోక్ సభలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వివరణాత్మక సమాచారాన్ని అందించారు. ఉగ్రవాదంపై తమది జీరో టాలరెన్స్ పాలసీ అని స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మా అభిప్రాయాలను స్పష్టంగా పేర్కొన్నాం. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ పాలసీ ఉందని ప్రపంచానికి చెప్పాం. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి భారతదేశ వైఖరిని అంగీకరించింది. పాకిస్తాన్ కుట్రను బయటపెట్టడమే విదేశాంగ మంత్రిత్వ శాఖ పని. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత మేం కఠినమైన చర్యలు తీసుకున్నాం అని అన్నారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ వాదనను కూడా ఆయన తిరస్కరించారు.

పహల్గామ్ దాడి తర్వాత స్పష్టమైన, బలమైన సందేశాన్ని పంపాలని నిర్ణయించుకున్నాం. ఏప్రిల్ 23న భద్రతపై క్యాబినెట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 5 నిర్ణయాలు తీసుకున్నారు. పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపే వరకు 1960 సింధు జల ఒప్పందం తక్షణమే నిలిపివేయడం, అట్టారి చెక్ పోస్ట్‌ను తక్షణమే మూసివేయడం, SARC వీసా మినహాయింపు పథకం కింద ప్రయాణించే పాకిస్తానీ జాతీయులపై ఆంక్షలు విధించడం వంటి నిర్ణయాలు తీసుకున్నాం అని ఆయన సభలో వెల్లడించారు.

భద్రతా వ్యవహారాలపై కేబినెట్ కమిటీ తొలి అడుగులు వేసిన తర్వాత, పహల్గామ్ దాడిపై భారతదేశ ప్రతిస్పందన అక్కడితో ఆగలేదని అన్నారు. దౌత్య, విదేశాంగ విధాన దృక్కోణం నుండి, పహల్గామ్ దాడిపై ప్రపంచ అవగాహనను రూపొందించడం మా పని. పాకిస్తాన్ దీర్ఘకాలంగా సీమాంతర ఉగ్రవాదాన్ని ఉపయోగిస్తున్న విషయాన్ని అంతర్జాతీయ సమాజానికి హైలైట్ చేయడానికి ప్రయత్నించాం అని పేర్కొన్నారు.

భారత్‌ – పాక్‌ మధ్య మధ్యవర్తి లేడు

అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ మే 9న ప్రధాని మోదీకి ఫోన్ చేశారని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. పాకిస్తాన్ పెద్ద దాడికి సిద్ధమవుతోందని ఆయన అన్నారు. దీనిపై ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పాకిస్తాన్‌కు తగిన సమాధానం ఇస్తామని అన్నారు. భారతదేశం పాకిస్తాన్‌కు బాధ్యతాయుతంగా స్పందించింది. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి జైశంకర్ డోనాల్డ్ ట్రంప్ వాదనను తోసిపుచ్చారు. భారత్‌, పాక్‌ మధ్య సీజ్‌ఫైర్‌ను తాను కుదిర్చానని, వ్యాపారం చేద్దామంటూ పెద్ద ఆఫర్లు ఇచ్చిన తర్వాత భారత్‌ పాక్‌ సీజ్‌ ఫైర్‌కు అంగీకరించినట్లు ట్రంప్‌ అనేకసార్లు వెల్లడించారు. కానీ, భారత్‌, పాకిస్తాన్ మధ్య మధ్యవర్తి లేరని జైశంకర్ మరోసారి స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us