పోలీసులకు చెమటలు పట్టిస్తున్న అమృత్ పాల్.. మళ్లీ కనిపించాడు

|

Mar 23, 2023 | 9:51 AM

వారీస్ పంజాబ్ దే అధినేత అమృత్ పాల్ సింగ్ గత కొన్ని రోజులుగా పంజాబ్ పోలీసులకు చెమటలు పట్టిస్తున్నాడు.

పోలీసులకు చెమటలు పట్టిస్తున్న అమృత్ పాల్.. మళ్లీ కనిపించాడు
Amritpal Singh
Follow us on

వారీస్ పంజాబ్ దే అధినేత అమృత్ పాల్ సింగ్ గత కొన్ని రోజులుగా పంజాబ్ పోలీసులకు చెమటలు పట్టిస్తున్నాడు. వేషాలు మార్చుకుంటూ వివిధ ప్రాంతాల్లోకి పారిపోతూ ముప్పు తిప్పలు పెడుతున్నాడు. అయితే తాజాగా అమృత్ పాల్ కు చెందిన ఓ ఫోటో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ఆ చిత్రంలో అమృత్ పాల్ సింగ్ ఓ బండిపై తన బైక్ ని తీసుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. అమృత్ పాల్ సింగ్ ను పట్టుకునేందుకు పోలీసులు ఏకంగా ఓ ఆపరేషన్ నే ప్రారంభించారు. దాదాపు ఆరు రోజుల నుంచి అమృత్ పాల్ తప్పించుకు తిరుగుతున్నాడు. గత శనివారం తన కాన్వాయ్ లో వస్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో బైక్ పై పారిపోయాడు. అప్పటి నుంచి పోలీసులు అతని కోసం వెతుకుతూనే ఉన్నారు.

 

ఇవి కూడా చదవండి

ఇప్పటివరకు అతనికి సంబంధించిన 100 మందిని అరెస్టు చేశారు. అమృత్ పాల్ ను ఇప్పటివరకు అదుపులోకి తీసుకోకపోవడంతో పంజాబ్ హైకోర్టు కూడా అధికార ప్రభుత్వంపై విమర్శలు చేసింది. వేలాది మంది పోలీసులు ఉండి… అమృత్ పాల్ ను పట్టకోవడానికి ప్లాన్ వేసినప్పటి అతడు తప్పించుకోవడం ఇంటిలిజెన్స్ ఫెయిల్యుర్ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు పంజాబ్ లో శాంతి, సామరస్యాలకు విఘాతం కలిగించేవారని ఎవ్వరినీ వదిలిపెట్టమని..వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని ఇటీవల పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ తెలిపారు.