నేపాల్.. కొత్త పొలిటికల్ మ్యాప్ పై పార్లమెంటులో ఓటింగ్ ?

ఇండియా తమకు చెందినవని చెప్పుకుంటున్న భూభాగాలను కూడా తమవేనని ప్రకటించుకునేందుకు ఉద్దేశించిన మ్యాప్ పై ఓటింగ్ చేపట్టేందుకు నేపాల్ పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశమైంది. అప్ డేట్ చేసిన మ్యాప్ ఆమోదం పొందాలంటే..

నేపాల్.. కొత్త పొలిటికల్ మ్యాప్ పై పార్లమెంటులో ఓటింగ్ ?

Edited By:

Updated on: Jun 13, 2020 | 4:49 PM

ఇండియా తమకు చెందినవని చెప్పుకుంటున్న భూభాగాలను కూడా తమవేనని ప్రకటించుకునేందుకు ఉద్దేశించిన మ్యాప్ పై ఓటింగ్ చేపట్టేందుకు నేపాల్ పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశమైంది. అప్ డేట్ చేసిన మ్యాప్ ఆమోదం పొందాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి. ఇందుకు సంబంధించిన (సవరణ) బిల్లుపై..ప్రత్యేకంగా సమావేశమైన పార్లమెంట్ ఓటింగ్ చేపట్టనుంది. అయితే మొదట ఈ బిల్లు మీద సభ చర్చను ప్రారంభిస్తుందని  ఈ చట్టసభ ప్రతినిధి రాజ్ నాథ్ పాండే తెలిపారు.  చర్చ అనంతరం ఓటింగ్ జరుగుతుందని ఆయన చెప్పారు. గత నెలలో నేపాల్ పాలక పార్టీ ఈ మ్యాప్ కు ఆమోదం తెలిపింది. (దీన్ని ఇండియా తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే). అటు-ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్ తాము సవరణకు అనుకూలంగా ఓటు చేస్తామని స్పష్టం చేసింది. ఈ బిల్లు ఆమోదం పొందాలంటే 275 మంది సభ్యులున్న దిగువ సభ (పార్లమెంటు)లో మూడింట రెండు వంతులమంది దీనికి మద్దతు తెలపవలసి ఉంటుంది. ఆ తరువాత దీన్ని నేషనల్ అసెంబ్లీకి పంపుతారు. సవరణలు ఏవైనా చేయదలచిన ఎంపీలకు ఆ అసెంబ్లీ 72 గంటల సమయం ఇస్తుంది. ఆ తరువాత బిల్లు పాస్ అయ్యాక.. నేపాల్ అధ్యక్షునికి దాన్ని నివేదిస్తారు. ఆ తరువాత రాజ్యాంగంలో చేరుస్తారు.

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us