Nagaland: అభివృద్ధిని చూసి ఓటు వేయండి.. సీట్ల పంపకం ప్రకారమే పార్టీ టిక్కెట్లు.. ఓటర్లకు సీఎం విజ్ఞప్తి..

నాగాలాండ్ లో మరోసారి పాగా వేసేందుకు అధికార పార్టీ తీవ్ర కసరత్తులు చేస్తోంది. రాష్ట్రంలో తాము చేసిన అభివృద్ధిని చూసి మరోసారి ఆదరించాలని నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ, బీజేపీ కూటమి తరఫున..

Nagaland: అభివృద్ధిని చూసి ఓటు వేయండి.. సీట్ల పంపకం ప్రకారమే పార్టీ టిక్కెట్లు.. ఓటర్లకు సీఎం విజ్ఞప్తి..
Nagaland Cm

Updated on: Feb 18, 2023 | 11:35 AM

నాగాలాండ్ లో మరోసారి పాగా వేసేందుకు అధికార పార్టీ తీవ్ర కసరత్తులు చేస్తోంది. రాష్ట్రంలో తాము చేసిన అభివృద్ధిని చూసి మరోసారి ఆదరించాలని నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ, బీజేపీ కూటమి తరఫున నాగాలాండ్ ముఖ్యమంత్రి నెయిఫియు రియో ఓటర్లను కోరారు. ఎన్‌డీపీపీ, బీజేపీ కూటమి చేసిన సీట్ల పంపకం ప్రకారమే పార్టీ టిక్కెట్లు పంపిణీ చేశామని, ఇందులో ఎన్‌డీపీపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలకు టిక్కెట్ ఇవ్వలేదని తెలిపారు. అట్టడుగు స్థాయిని బట్టి టిక్కెట్లు ఇచ్చామన్నారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కార్యక‌ర్తలు క‌ష్టప‌డి ప‌నిచేయాల‌ని పిలుపునిచ్చారు. నాగాలాండ్ శాసనసభలో మరో 20 స్థానాలు, మరో రెండు పార్లమెంటరీ స్థానాలు అదనంగా వస్తాయని నాగా చర్చల సులభతరంగా కేంద్రం ప్రభుత్వంతో పంచుకున్న విషయాన్ని ర్యాలీలో పాల్గొన్న వారికి ఆయన తెలిపారు.

14వ నాగాలాండ్ శాసనసభలో నాగా రాజకీయ సమస్యను పరిష్కరించడం కొత్త ప్రభుత్వానికి ప్రధాన అంశంగా ఉంటుందని రియో​పేర్కొన్నారు. ఎన్‌డీపీపీ, బీజేపీ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని రియో చెప్పారు. అయితే ఎన్‌డీపీపీ మినహా మరే ఇతర పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోలేదు. 2018 ఎన్నికల్లో ఎన్‌డీపీపీ ‘మార్పు వస్తోంది’ అనే నినాదంతో ఎన్నికలను ఎదుర్కొంది. ఈ దిశగా అధికారపక్షంలో లేదా ప్రతిపక్షంలో ఉండటమే నిర్ణయమని ప్రజలకు తెలియజేశారు. కాబట్టి.. ఇతర పార్టీలు, అభ్యర్థుల ప్రచారాలతో అయోమయానికి గురికావద్దని, మోసపోవద్దని ప్రజలకు సూచించారు.

ఎన్‌డీపీపి ప్రజల పార్టీ అని, ప్రజల భాగస్వామ్యం అవసరమని, ఈ విషయంలో చోజుబా అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధికి ఎన్‌డీపీపీ అభ్యర్థి కుడెచో ఖామోను ఎన్నుకోవాలని 18వ చోజుబా అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లను కోరారు. నాగాలాండ్ శాసనసభ నాగా రాజకీయ సమస్యను చాలా సీరియస్‌గా కొనసాగించిందని.. పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నామని మంత్రి నెయిబా క్రోను చెప్పారు. రాష్ట్రంలో వివాదరహిత నాయకుడు నెయిఫియు అని కొనియాడారు. మేఘాలయతో పాటు నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. మార్చి 2న త్రిపురతో పాటు ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us