Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: రూ.17,500 పెట్టి సెలూన్‌లో ఫేషియల్ చేయించిన మహిళ.. ఆ తర్వాత

కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్టు ఉంది అన్నది సామెత. పాపం ముంబైలోని ఓ మహిళకు అలాంటి అనుభవమే ఎదురయ్యింది. ముఖంపై గుంతలు పూడ్చేందుకు బ్యూటీ సెలూన్‌కు వెళ్తే.. అసలుకే మోసం వచ్చింది.

Viral:  రూ.17,500 పెట్టి సెలూన్‌లో ఫేషియల్ చేయించిన మహిళ.. ఆ తర్వాత
Hydrafacial Treatment
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 20, 2023 | 12:28 PM

ఒక్కసారి మా బ్యూటీ సెలూన్‌కి రండి.. మీ ముఖం నిగనిగలాడిపోతుంది..? మీ ఫేస్‌పై గుంతలు ఉన్నాయా..? ఒక్క విజిట్‌తో మటుమాయం అంతే. కళ్ల కింద కింద నల్లటి ఛాయలుతో ఇబ్బంది పడుతున్నారా…? వాటిని మాయం చేసే బాధ్యత మాది.. ఇలానే చెప్పి వేలకు వేలు దండుకుంటున్నారు సెలూన్స్ వాళ్లు. రిజల్ట్ ఉంటుందా అంటే.. అది కూడా నమ్మే పని లేదు. కొన్ని చోట్ల ఫేస్ గ్లో రావడం పక్కన బెడితే అసలుకే మోసం వస్తుంది. తాజాగా ముంబైలో అదే జరిగింది. ఫేషియల్ మసాజ్ ట్రీట్‌మెంట్ చేయించడం వల్ల.. మహిళకు ముఖంపై కాలిన మాదిరిగా గాయలయ్యాడు. చర్మం కూడా పలు చోట్ల పర్మనెంట్‌గా డ్యామేజ్ అయ్యింది.

జూన్ 17న అంధేరిలోని కామధేను షాపింగ్ సెంటర్‌లోని గ్లో లక్స్ సెలూన్‌కు సదరు మహిళ వెళ్లింది. అక్కడ రూ.17,500 విలువైన హైడ్రాఫేషియల్ ట్రీట్‌మెంట్ ఆమె చేయించుకుంది. ఆ తర్వాత ఆమె ముఖం గతంలో పోలిస్తే గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. హైడ్రాఫేషియల్ అనేది వైద్య-స్థాయి రీసర్ఫేసింగ్ చికిత్స. ఈ ప్రాసెస్ ద్వారా ముఖంపై రంధ్రాలను క్లియర్ చేస్తారు. ఈ ప్రొసీజర్ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. లైసెన్స్ పొందిన వైద్య వృత్తిపరమైన సౌకర్యాల ఉన్న చోట.. సర్టిఫైడ్ హైడ్రాఫేషియల్ బ్యూటీషియన్ అందుబాటులో ఉన్న చోట ఈ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది.

చికిత్స తర్వాత, ముంబైకి చెందిన మహిళకు ముఖంపై చర్మం మండుతున్నట్లు అనిపించడంతో… డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించింది. హైడ్రాఫేషియల్ ట్రీట్‌మెంట్ వల్ల ఆమె ముఖంపై పలు చేట్ల కాలిన గాయాలు అయ్యాయని.. చర్మం పలు చోట్ల శాశ్వతంగా దెబ్బతిన్నదని డెర్మటాలజిస్ట్ వెల్లడించారు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ సదరు మహిళ స్థానిక  కార్పొరేటర్ ప్రశాంత్ రాణే సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..