Modi Government: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రయాణికులకు మరింత భద్రత

|

Jan 14, 2022 | 7:48 PM

Modi Government:ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు ఎక్కువైపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాలు..

Modi Government: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రయాణికులకు మరింత భద్రత
Follow us on

Modi Government:ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు ఎక్కువైపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాలు నడిపే వారి కోసం తీపి కబురు అందించింది. ఫోర్‌ వీలర్, ప్యాసింజర్‌ వాహనాల్లో ప్రయాణించే వారి కోసం ఈ శుభవార్త అందించింది. ఎం1 కేటగిరి, ప్యాసింజర్‌ వాహనాల్లో ఆరు ఎయిర్ బ్యాగ్స్‌ తప్పకుండా ఉండాల్సిందేనని కేంద్రం తెలిపింది. దీనికి సంబంధించి ముసాయిదాకు మోడీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

అయితే కేంద్ర సర్కార్‌ ఇప్పటికే డ్రైవర్‌కు, కో- ప్యాసింజర్‌కు ఎయిర్‌ బ్యాగ్స్‌ తప్పకుండా ఉండాలనే నిబంధన తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అదే కో-ప్యాసింజర్‌కు కూడా ఎయిర్‌ బ్యాగ్స్‌ తప్పనిసరి రూల్‌ 2022 జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. ఇక తాజాగా ఫోర్‌ వీలర్‌కు ఆరు ఎయిర్ బ్యాగ్స్‌ తప్పనిసరి చేస్తూ కొత్త నిబంధనకు ఆమోదం తెలిపింది కేంద్ర ప్రభుత్వం.

ప్యాసింజర్‌ల భద్రత నేపథ్యంలో ఈ ఎయిర్‌ బ్యాగ్స్‌ నిబంధన తీసుకువచ్చింది కేంద్రం. ఈ మేరకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ట్వీట్‌ చేశారు. ఈ ఎయిర్‌ బ్యాగ్స్‌ ఉండటం వల్ల వాహనంలో వెనుక కూర్చున్న ప్రయాణికులకు భద్రత ఉంటుంది. 8 మంది వరకు ప్రయాణించే ఫోర్‌ వీలర్‌ వాహనంలో ఈ ఎయిర్‌ బ్యాగ్స్‌ ఉంటే భద్రత ఎక్కువగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఎం1 వాహన కేటగిరిలో నాలుగు అదనపు ఎయిర్‌ బ్యాగ్స్‌ ఉండేలా చర్యలు చేపట్టింది కేంద్రం.

 

ఇవి కూడా చదవండి:

Post Office Scheme: నెలకు రూ.1000తో చేతికి రూ.8 లక్షలు.. పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌..!

LIC Adharshila Plan: ఆధార్‌ కార్డు ఉన్న ప్రతి మహిళకు అదిరిపోయే బెనిఫిట్‌.. ఈ స్కీమ్‌లో చేరితే లక్షల్లో ఎంతో ప్రయోజనం