తహసీల్దారు కార్యాలయంలో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన మాజీ ఎమ్మెల్యే భార్య!

తనకు న్యాయం చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే భార్య గోడు వెళ్లబోసుకుంది. ఏకంగా తహసీల్దార్ కార్యాలయంలో ఆత్మహత్యకు యత్నించింది. మధ్యప్రదేశ్‌లోని కాట్ని జిల్లా బర్వారా తహసీల్ కార్యాలయంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే విజయ్ రాఘవేంద్ర సింగ్ భార్య రంజితా సింగ్ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

తహసీల్దారు కార్యాలయంలో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన మాజీ ఎమ్మెల్యే భార్య!
Katni News 2[1]

Updated on: Jun 05, 2025 | 9:21 PM

తనకు న్యాయం చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే భార్య గోడు వెళ్లబోసుకుంది. ఏకంగా తహసీల్దార్ కార్యాలయంలో ఆత్మహత్యకు యత్నించింది. మధ్యప్రదేశ్‌లోని కాట్ని జిల్లా బర్వారా తహసీల్ కార్యాలయంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే విజయ్ రాఘవేంద్ర సింగ్ భార్య రంజితా సింగ్ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. తన భూమికి సంబంధించిన వివాదంపై విచారణ కోసం బర్వారా నాయిబ్ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చింది రంజితా సింగ్.

ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, బర్వారా తహసీల్ కార్యాలయంలో ఉన్న ఉద్యోగులు, ఫిర్యాదుదారుల ముందు రంజితా సింగ్ అకస్మాత్తుగా తనపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య ప్రయత్నించింది. అయితే, అక్కడ ఉన్న వ్యక్తులు ఆమెను అడ్డుకుని, సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్లారు. ఈ సంఘటన తహసీల్దా్ర్ కార్యాలయ ప్రాంగణంలో భయాందోళనలు సృష్టించింది.

తాను సెప్టెంబర్ 15, 2021న బిలాయత్ కాలా గ్రామంలో జహాన్ సింగ్ అనే వ్యక్తి నుండి 0.39 హెక్టార్లలో 1176 చదరపు అడుగుల భూమిని కొనుగోలు చేశానని రంజితా సింగ్ తెలిపింది. అయితే ఆ భూమిని అనురోధ్ తివారీ అనే వ్యక్తి ఆక్రమించాడని, అతను 1995 నుండి దానిని ఆక్రమించుకున్నాడని ఆరోపించారు. గత ఆరు నెలలుగా తాను తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నానని, కానీ ఇప్పటివరకు ఎటువంటి పరిష్కారం దొరకలేదని రంజిత చెప్పింది. నాయిబ్ తహసీల్దార్ అనురాధ సింగ్ నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు.

ఈ సంఘటన తర్వాత, నయీబ్ తహసీల్దార్ అనురాధ సింగ్ రంజితా సింగ్ ఆరోపణలను తోసిపుచ్చారు. ఈ విషయం రెవెన్యూ కోర్టులో పెండింగ్‌లో ఉందని అన్నారు. దరఖాస్తుదారుడు కాని వ్యక్తి 1995 నుండి ఆ భూమిని స్వాధీనం చేసుకున్నాడు. అయితే 2021లో ఆ భూమిని రంజితా సింగ్ పేరు మీద బదిలీ చేశారు. అటువంటి పరిస్థితిలో, ఈ విషయం వివాదాస్పదమైంది. దాని పరిష్కారం చట్టపరమైన ప్రక్రియలో మాత్రమే సాధ్యమవుతుంది. కోర్టు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని, ఎటువంటి నిర్లక్ష్యం జరగలేదని అనురాధ సింగ్ స్పష్టం చేశారు.

ఈ సంఘటన తర్వాత, అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ విషయాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించాలని స్థానిక ప్రజలు అంటున్నారు. మాజీ ఎమ్మెల్యే భార్య మాట విననప్పుడు, సామాన్య ప్రజలతో ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం, పోలీసులు, రెవెన్యూ శాఖ ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us