Lok Sabha Election: హాజీపూర్ స్థానం నుండి నామినేషన్ వేసేందుకు వెళ్తూ ఏడ్చేసిన చిరాగ్ పాశ్వాన్..!
లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) జాతీయ అధ్యక్షుడు, జముయ్ ఎంపీ చిరాగ్ పాశ్వాన్ గురువారం (మే 02) హాజీపూర్ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్కు ముందు ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భావోద్వేగానికి లోనయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎల్జేపీ (రామ్ విలాస్) జాతీయ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ హాజీపూర్ పార్లమెంట్ స్థానం నుంచి ఎన్డీయే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు […]
లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) జాతీయ అధ్యక్షుడు, జముయ్ ఎంపీ చిరాగ్ పాశ్వాన్ గురువారం (మే 02) హాజీపూర్ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్కు ముందు ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భావోద్వేగానికి లోనయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఎల్జేపీ (రామ్ విలాస్) జాతీయ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ హాజీపూర్ పార్లమెంట్ స్థానం నుంచి ఎన్డీయే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా కూడా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. హాజీపూర్ నుండి ప్రస్తుత ఎంపీ చిరాగ్ పాశ్వాన్ మామ పశుపతి కుమార్ పరాస్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. హాజీపూర్లో చిరాగ్ పాశ్వాన్తో RJD శివచంద్ర రామ్ తలపడుతున్నారు.
నామినేషన్ వేసేందుకు వెళ్తూ, తన తండ్రి రామ్విలాస్ పాశ్వాన్ను గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు చిరాగ్ పాశ్వాన్. ఈ రోజు తన తండ్రి లేని లోటును హద్దులు దాటి ఫీలవుతున్నానని చిరాగ్ పాశ్వాన్ అన్నారు. నాన్న లేకుండా నామినేషన్ దాఖలు చేయడం ఇదే తొలిసారి అని చిరాగ్ అన్నారు. 2014 ఎన్నికలు అయినా, 2019 ఎన్నికలు అయినా ఆయన ఎప్పుడూ నాతోనే ఉండేవారు. 2019లో నామినేషన్ దాఖలు చేయడానికి జముయ్కి వెళుతున్నప్పుడు, నా చేయి పట్టుకుని తీసుకెళ్లాడని, జీవితంలో మొదటిసారి అతను నాతో లేకుండానే నామినేషన్కు వెళ్తున్నానని చిరాగ్ పాశ్వాన్ ఉద్వేగానికి లోనయ్యారు. హాజీపూర్ ప్రజల ఆశీస్సులు కోరబోతున్నానని, తన తండ్రిని హాజీపూర్ ప్రజలు ఎప్పుడూ గౌరవించినట్లే, తనకు కూడా ఈ ఆశీర్వాదం లభిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
#WATCH | Bihar: Ahead of filing his nomination today, LJP National President and party candidate from Hajipur, Chirag Paswan says, "This is the first time in my life that I am going to file nomination without my father. Be it the 2014 election or the 2019 election, he was always… pic.twitter.com/77kZJMB4aS
— ANI (@ANI) May 2, 2024
హాజీపూర్ లోక్సభ స్థానం దివంగత రామ్విలాస్ పాశ్వాన్ జన్మస్థలం. ఆయన తండ్రి రామ్విలాస్ పాశ్వాన్ ఈ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేసి ఇక్కడ నుంచి విజయం సాధించి రికార్డు సృష్టించారు. దీని తర్వాత చిరాగ్ పాశ్వాన్ హాజీపూర్ స్థానం నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. చిరాగ్ పాశ్వాన్ జముయ్ నుండి వరుసగా రెండుసార్లు ఎంపీ అయ్యారు. 2019లో చిరాగ్ మామ, మాజీ కేంద్ర మంత్రి పశుపతి పరాస్ హాజీపూర్ స్థానం నుంచి ఎల్జేపీ టికెట్పై పోటీ చేసి గెలుపొందారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…