PM Modi: ట్యాక్స్ సిటీని.. ట్యాంకర్ సిటీగా మార్చిన కాంగ్రెస్.. బెంగళూరులో కాంగ్రెస్పై ప్రధాని మోదీ ఫైర్
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నాటకలోని చిక్కబల్లాపూర్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ట్యాక్స్ సిటీని కాంగ్రెస్ ట్యాంకర్ సిటీగా మార్చిందని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నాటకలోని చిక్కబల్లాపూర్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ట్యాక్స్ సిటీని కాంగ్రెస్ ట్యాంకర్ సిటీగా మార్చిందని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. వ్యవసాయం నుంచి పట్టణ మౌలిక సదుపాయాల వరకు బడ్జెట్లో కోత పెడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ దృష్టి కేవలం అవినీతిపైనే ఉందన్న మోదీ, బెంగళూరు సమస్యలపై కాదన్నారు. అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని స్పష్టం చేశారు.
కాంగ్రెస్, భారత్ కూటమి పాలనలో కర్ణాటకలో బాంబులు పేలుతున్నాయన్నారు. భజన, కీర్తనలు చేస్తున్న వారిపై దాడులు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యర్థులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్న ప్రధాని.. మోదీ లక్ష్యం దేశాభివృద్ధే అన్ని స్పష్టం చేశారు. కాంగ్రెస్ దాడులు చేస్తున్నారు, అభివృద్ధి పనుల్లో బీజేపీ బిజీగా ఉందన్నారు.
To fulfil your dreams, JDS and BJP have come together. Therefore, I guarantee that your dreams are my resolve.
My life is dedicated to you and the country.
I promise 24/7 for 2047.
– PM @narendramodi pic.twitter.com/MvqGiYW4vH
— BJP (@BJP4India) April 20, 2024
కాంగ్రెస్ పార్టీ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ అధ్వాన్నంగా ఉందని, భారతీయ బ్యాంకులు సంక్షోభంలో ఉన్నాయని, మోసాలు విదేశీ పెట్టుబడిదారులను ఇబ్బందులకు గురిచేశాయని ప్రధాని మోదీ గుర్తు చేశారు. కానీ నేటి పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు భారత్తో అనుసంధానం కావాలని, భారత్లో పెట్టుబడులు పెట్టాలని కోరుకుంటున్నాయన్నారు. భారతదేశం రికార్డు స్థాయిలో ఎగుమతులు చేస్తోంది. గతంలో భారతదేశం 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేది, కానీ ఇప్పుడు భారతదేశం మొదటి ఐదు ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉందన్నారు. 2014కు ముందు చాలా పరోక్ష పన్నులు ఉండేవని ప్రధాని మోదీ అన్నారు. అయితే జీఎస్టీ అమల్లోకి వచ్చాక పరోక్ష పన్నులు తగ్గాయి. ఇది వేల రూపాయలు ఆదా చేయడంలో సహాయపడింది. గతంలో దాదాపు రూ.400 ఉండే ఎల్ఈడీ బల్బు ఇప్పుడు రూ.40 మాత్రమే పలుకుతుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలు శరవేగంగా సాగుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. 2014లో మెట్రో నెట్వర్క్ 17 కిలోమీటర్లు మాత్రమే ఉండగా ఇప్పుడు అది 70 కిలోమీటర్లకు పైగా పెరిగింది. 2014, 2019లో రికార్డు ఓట్లతో విజయం సాధించామని, దాని ఫలితమే బలమైన ప్రభుత్వమని అన్నారు. ఇప్పుడు 2024లో బలమైన ప్రభుత్వం ఏర్పడితే దేశ ప్రగతికి కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని మోదీ అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…