దేశంలో త్వరలో నాలుగు కరోనా వ్యాక్సీన్ లు క్లినికల్ ట్రయల్ దశకు చేరుతాయని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఇందుకు పధ్నాలుగు మందిపై ప్రయోగాత్మక పరీక్షలు జరుగుతాయన్నారు. దేశంలో విధించిన లాక్ డౌన్ వల్ల మంచి ఫలితాలు వచ్చాయని, అసలు ఈ లాక్ డౌన్ ని కరోనా వ్యాక్సీన్ గా చెప్పుకోవచ్చునని ఆయన అభివర్ణించారు. లాక్ డౌన్ విధించక ముందు దేశంలో కరోనా కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి మూడు నాలుగు రోజులు పట్టేదని, కానీ ఈ ఆంక్షలు విధించాక అది పదమూడు రోజులకు పెరిగిందని ఆయన చెప్పారు. సరైన సమయంలో ఈ ఆంక్షలు విధించి మంచి నిర్ణయం తీసుకున్నాం. లేదా పరిస్థితి చెయ్యి దాటి ఉండేది అని ఆయన వ్యాఖ్యానించారు. చాలా ధనిక దేశాలు ఈ విషయంలో నిర్లక్ష్యం వహించాయని ఆయన పేర్కొన్నారు. కొన్ని దేశాల్లో పరిస్థితి విషమించాక నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు.