Taj Mahal Controversy: తాజ్ మహల్ నిర్మించిన భూమి తమదే అంటున్న జైపూర్ మాజీ యువరాణి.. ఆధారాలతో రె’ఢీ’

ప్రేమకు చిహ్నంగా పేరుగాంచిన, ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటైన తాజ్ మహల్ వివాదంలో చిక్కుకుంది. తాజ్ మహల్ - తేజో మహాలయకు సంబంధించి కొనసాగుతున్న వివాదం మధ్యలో కొత్తగా మరో ట్విస్ట్ చోటుచేసుకుంది.

Taj Mahal Controversy: తాజ్ మహల్ నిర్మించిన భూమి తమదే అంటున్న జైపూర్ మాజీ యువరాణి.. ఆధారాలతో రెఢీ
Bjp Mp Diya Kumari

Updated on: May 11, 2022 | 5:54 PM

Taj Mahal Controversy: ప్రేమకు చిహ్నంగా పేరుగాంచిన, ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటైన తాజ్ మహల్ వివాదంలో చిక్కుకుంది. తాజ్ మహల్ – తేజో మహాలయకు సంబంధించి కొనసాగుతున్న వివాదం మధ్యలో ఇప్పుడు కొత్తగా మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. రాజస్థాన్‌లోని జైపూర్ రాజకుటుంబానికి చెందిన మాజీ యువరాణి, రాజ్‌సమంద్‌కు చెందిన భారతీయ జనతా పార్టీ ఎంపీ దియా కుమారి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. తాజ్ మహల్ నిర్మించిన భూమి వాస్తవానికి జైపూర్ పాలకుడు జై సింగ్‌కు చెందినదని, దీనిని మొఘల్ చక్రవర్తి షాజహాన్ స్వాధీనం చేసుకున్నారని, గతంలో జైపూర్ రాజకుటుంబానికి సంబంధించిన రికార్డులు అందుబాటులో ఉన్నాయని ఎంపీ దియా కుమారి బుధవారం పేర్కొన్నారు. అప్పట్లో ప్రభుత్వంలో ఉండడంతో కుటుంబం ఆయనను ఎదిరించలేకపోయిందన్నారు,

తాజ్ మహల్ చరిత్రపై నిజనిర్ధారణ విచారణ జరిపించాలని, మూసి ఉన్న 22 గదుల తలుపులు తెరవాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టులో వేసిన పిటిషన్‌కు కూడా ఆమె మద్దతు ఇచ్చారు.”స్మారక చిహ్నం నిర్మించబడటానికి ముందు అక్కడ ఏమి ఉందో దర్యాప్తు చేయాలి. ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంది. జైపూర్ కుటుంబం వద్ద రికార్డులు అందుబాటులో ఉన్నాయి. అవసరమైతే వాటిని అందజేసేందుకు సిద్ధంగా ఉన్నాం,” అని దియా కుమారి పేర్కొన్నారు. తాజ్‌మహల్‌లో దేవుడి గుడి ఉందని దేశంలో చర్చ జరుగుతోంది. దీని గురించి దియా కుమారిని అడిగితే అక్కడ ఏదైనా గుడి ఉందా? ఈ ప్రశ్నకు బదులిస్తూ.. తాను ఇంకా అన్ని పత్రాలు చూడలేదని, అయితే ఆ ఆస్తి మా కుటుంబానికి చెందినదని చెప్పారు.‘‘భూమికి బదులు పరిహారం ఇచ్చారు. కానీ అది ఎంత, అంగీకరించినా ఒప్పుకోకున్నా.. మా పోతిఖానాలో ఉన్న రికార్డులను అధ్యయనం చేయనందున ఈ విషయం చెప్పలేను. కానీ ఆ భూమి మా కుటుంబానికి చెందినది. షాజహాన్ దానిని స్వాధీనం చేసుకున్నాడు, ”అని ఆమె అన్నారు.

“న్యాయవ్యవస్థ లేదు కాబట్టి, అప్పట్లో మా పూర్వీకులు అప్పీల్ చేయలేకపోయారు. రికార్డులను పరిశీలించిన తర్వాతే విషయాలు తేలుతాయి” అని దియా కుమారి అన్నారు. దేశంలోని ప్రముఖ వ్యవహారాల్లో దియా కుమారి తరచూ చర్చల్లో పాల్గొంటారు. అయోధ్య జన్మభూమిలోని శ్రీరామ మందిరం విచారణ సందర్భంగా, రాముడి వారసుల గురించి సమస్య తలెత్తినప్పుడు, జైపూర్ రాజకుటుంబానికి చెందిన సభ్యులు కూడా తాము రాముడి వారసులమని పేర్కొన్నారు. ఇందుకోసం ఆమె కోర్టులో సాక్ష్యం చెప్పేందుకు కూడా సిద్ధమయ్యారు.

తాజ్ మహల్ వివాదం ఏమిటి

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో నిర్మించిన తాజ్‌మహల్‌కు సంబంధించి అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్‌లో అయోధ్య బీజేపీ నేత డాక్టర్ రజనీష్ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. చాలా కాలంగా మూతపడిన తాజ్ మహల్‌లోని 22 గదులను తెరిపించడం ద్వారా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) నుండి సర్వే చేయాలని డాక్టర్ సింగ్ తన పిటిషన్‌లో డిమాండ్ చేశారు. తాజ్ మహల్‌లో హిందూ దేవుళ్లు, దేవతల శిల్పాలు, శాసనాలు ఉండవచ్చునని పిటిషనర్ పేర్కొన్నారు. సర్వే చేస్తే తాజ్‌మహల్‌లో హిందూ విగ్రహాలు, శాసనాలు ఉన్నాయా లేదా అనేది తేలిపోతుందని పిటిషన్‌లో కోర్టును కోరారు. కాగా, ఈ కేసుకు సంబంధించి రిజిస్ట్రీ ఆమోదించిన తర్వాత పిటిషన్ విచారణ కోసం కోర్టు ముందుకు వస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us