రెండు నెలల తర్వాత… కళకళలాడిన కోల్కతా ఎయిర్పోర్ట్
రెండునెలల విరామం తరువాత కోల్కతా ఎయిర్పోర్ట్లో విమానాల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. దేశంలోని వివిధ నగరాల నుంచి 10 విమానాలు కోల్కతా విమానాశ్రయానికి వచ్చాయి. మరో పది విమానాలు వివిధ నగరాలకు టేకాఫ్ అయ్యాయి. దీంతో ఈ రోజు (28మే) కోల్కతా విమానాశ్రయం ప్రయాణికులతో కళకళలాడింది. ఢిల్లీ నుంచి కోల్కతా విమానాశ్రయానికి 122 మంది ప్రయాణికులు చేరుకున్నారు. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో విమానాశ్రయాన్ని శానిటైజ్ చేయడంతోపాటు ప్రయాణికుల మధ్య భౌతిక దూరం ఉండేలా విమానాశ్రయ సిబ్బంది ప్రత్యేక […]
రెండునెలల విరామం తరువాత కోల్కతా ఎయిర్పోర్ట్లో విమానాల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. దేశంలోని వివిధ నగరాల నుంచి 10 విమానాలు కోల్కతా విమానాశ్రయానికి వచ్చాయి. మరో పది విమానాలు వివిధ నగరాలకు టేకాఫ్ అయ్యాయి. దీంతో ఈ రోజు (28మే) కోల్కతా విమానాశ్రయం ప్రయాణికులతో కళకళలాడింది. ఢిల్లీ నుంచి కోల్కతా విమానాశ్రయానికి 122 మంది ప్రయాణికులు చేరుకున్నారు.
కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో విమానాశ్రయాన్ని శానిటైజ్ చేయడంతోపాటు ప్రయాణికుల మధ్య భౌతిక దూరం ఉండేలా విమానాశ్రయ సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బాగ్ డోగ్రా విమానాశ్రయానికి కూడా విమానాలు రాకపోకలు మొదలయ్యాయి. ప్రయాణికులను తనిఖీ చేయడంతోపాటు కరోనా లక్షణాలున్న వారిని హోం క్వారంటైన్కు తరలించారు అధికారులు.
అంఫాన్ తుఫాను ప్రభావంతో కుండపోతగా వర్షం కురవడంతో కోల్కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయం జలదిగ్భందలో చిక్కుకుపోయిన విశయం తెలిసిందే. ఆ సమయంలో విమనాలు సైతం ధ్వంసమయ్యాయి.
Welcome Back Passengers!#KolkataAirport saw the arrival of 122 passengers from @DelhiAirport after two long months and 40 passengers departed to #Guwahati. Proper checks were followed and regular sanitization was carried out in terminal which was abuzz with passengers. pic.twitter.com/ZrqmPBxDSf
— Kolkata Airport (@aaikolairport) May 28, 2020