Golden Temple:1500 కిలోల బంగారంతో టెంపుల్.. మరెక్కడో కాదు..మనదగ్గరే..! వెళ్లాలంటే ఆ రూల్‌ తప్పనిసరి..?

|

Aug 23, 2022 | 4:56 PM

ఈ గోల్డెన్ టెంపుల్ అమృత్‌సర్‌లోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన గోల్డెన్ టెంపుల్‌ని పోలి ఉంటుంది. అమృత్‌సర్ స్వర్ణ దేవాలయాన్ని చూసిన వారు ఇక్కడ సందర్శించిన తర్వాత రెండింటి సారూప్యతలను పోల్చవచ్చు. ఇక్కడ కూడా అమృత్‌సర్ వంటి భారీ చెరువు ఉంది, ఇది ఆలయం మధ్యలో ఉంది.

Golden Temple:1500 కిలోల బంగారంతో టెంపుల్.. మరెక్కడో కాదు..మనదగ్గరే..! వెళ్లాలంటే ఆ రూల్‌ తప్పనిసరి..?
Golden Temple
Follow us on

Sri Lakshmi Narayani Golden Temple: అమృత్‌సర్‌లోనే కాకుండా దక్షిణ భారతదేశంలో కూడా గోల్డెన్ టెంపుల్ ఉందని మీకు తెలుసా. 100 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ స్వర్ణ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే.. 1500 కిలోల స్వచ్ఛమైన బంగారంతో దీన్ని తయారు చేశారు. దీన్ని బట్టి ఈ ఆలయ వైభవం గురించి మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ గోల్డెన్ టెంపుల్ అమృత్‌సర్‌లోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన గోల్డెన్ టెంపుల్‌ని పోలి ఉంటుంది. అమృత్‌సర్ స్వర్ణ దేవాలయాన్ని చూసిన వారు ఇక్కడ సందర్శించిన తర్వాత రెండింటి సారూప్యతలను పోల్చవచ్చు. ఇక్కడ కూడా అమృత్‌సర్ వంటి భారీ చెరువు ఉంది, ఇది ఆలయం మధ్యలో ఉంది. దక్షిణ భారతదేశంలో ఉన్న ఈ గోల్డెన్ టెంపుల్ గురించి వివరంగా తెలుసుకుందాం.

దక్షిణ భారతదేశంలోని తమిళనాడులోని వెల్లూరులో ఉన్న ఈ స్వర్ణ దేవాలయం విష్ణువు, లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. ఈ ఆలయాన్ని సందర్శించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ స్వర్ణ దేవాలయం పేరు శ్రీపురం గోల్డెన్ టెంపుల్ (శ్రీ లక్ష్మీ నారాయణి గోల్డెన్ టెంపుల్). ఈ స్వర్ణ దేవాలయాన్ని శ్రీ లక్ష్మీ నారాయణ్ గోల్డెన్ టెంపుల్ అని కూడా అంటారు.

లక్ష్మీ నారాయణ్ గోల్డెన్ టెంపుల్ చెరువులో మీరు బంగారు, వెండి ఆభరణాలు, నాణేలను చూడవచ్చు. ఈ గోల్డెన్ టెంపుల్ ఆకారం శ్రీ యంత్రంలా కనిపిస్తుంది. దాని వల్ల దాని అందం మరింత పెరుగుతుంది. ప్రధాన ఆలయం నుండి ఆలయ ప్రవేశ ద్వారం వరకు దాదాపు 1.5 నుండి 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ సమయంలో మీరు దారిలో పచ్చదనం మాత్రమే చూస్తారు. ఆలయ ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నప్పుడు మీరు అనేక ఆధ్యాత్మిక సందేశాలను చదవవచ్చు. ఇక్కడ శ్రీపురం స్పిరిచువల్ పార్క్ కూడా ఉంది.

ఇవి కూడా చదవండి

ఆలయంలోకి ప్రవేశించేందుకు డ్రెస్ కోడ్ ఉంది. దానిని ధరించిన తర్వాతే భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. ఆలయంలో భక్తులు ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లడం నిషేధించబడింది. భక్తులు ఈ ఆలయాన్ని ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు దర్శించుకోవచ్చు. మీరు ఇంకా ఈ ఆలయాన్ని చూడకపోతే, ఈ సారి టూర్‌ తప్పక ప్లాన్‌ చేసుకోండి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి