ఫ్రెండ్‌ ఇంట్లో దొంగతనం చేసిన పోలీస్‌ కానిస్టేబుల్‌.. బంగారు ఆభరణాలు చోరీ.. కట్‌ చేస్తే సీన్‌ రివర్స్‌..

కొద్ది రోజుల క్రితం ఓ పోలీస్ అధికారి ఒకరు 10 కిలోల మామిడి పండ్లను దొంగిలించిన ఘటన సోషల్ మీడియా వేదికగా తీవ్ర సంచలనం రేపింది. తాజాగా మరో పోలీస్ కానిస్టేబుల్ తన స్నేహితుడి భార్య నగలు కాజేసి పోలీసులకు చిక్కాడు..

ఫ్రెండ్‌ ఇంట్లో దొంగతనం చేసిన పోలీస్‌ కానిస్టేబుల్‌.. బంగారు ఆభరణాలు చోరీ.. కట్‌ చేస్తే సీన్‌ రివర్స్‌..
Kerala Civil Police
Follow us

|

Updated on: Oct 22, 2022 | 9:20 PM

బాధితులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే భక్షకులుగా మారుతున్నారు. కొద్ది రోజుల క్రితం కేరళ పోలీసు ఒకరు 10 కిలోల మామిడి పండ్లను దొంగిలించిన ఘటన సోషల్ మీడియా వేదికగా తీవ్ర సంచలనం రేపింది. ఆ తర్వాత ఓ సైనికుడిపై దాడి ఘటన జాతీయ స్థాయిలో వార్తల్లో హల్‌చల్‌ చేసింది. ఇక తాజాగా తన స్నేహితుడి ఇంట్లో బంగారు నగలు చోరీకి పాల్పడిన కానిస్టేబుల్‌ను అరెస్టు చేశారు పోలీసులు. కానిస్టేబుల్ తన చిన్ననాటి స్నేహితుడి ఇంట్లో ఈ చోరీకి పాల్పడ్డాడు. ఈ ఘటన కేరళలోని కొచ్చిలో చోటు చేసుకుంది. కొచ్చిలోని నజరక్కల్‌లో నివాసముంటున్న నటేశన్‌ ఇంట్లో 10తులాల బంగారు ఆభరణాలను అపహరించిన కొచ్చి నగర పోలీసు ఏఆర్‌ క్యాంపు సిబ్బంది అమల్‌దేవ్‌ను అరెస్టు చేశారు. బంగారు నగలు నటేషా భార్యకు చెందినవిగా గుర్తించారు. ఆమె బెడ్‌రూమ్‌లోని అల్మారాలో దాచి ఉంచిన నగలను చోరీ చేశాడు కానిస్టేబుల్‌. ఈ దోపిడీ కేసు అక్టోబర్ 13న జరిగినట్టుగా తెలిసింది.

ఇకపోతే, ఈ సంఘటనలో చోరీకి పాల్పడిన కానిస్టేబుల్‌, బాధిత వ్యక్తి ఇద్దరూ చిన్ననాటి స్నేహితులే.. అందుకే నిందితులు నటేశన్ ఇంటికి తరచూ వచ్చేవాడు.. ఆభరణాలు పోయిన విషయం కుటుంబ సభ్యులకు తెలిసినప్పటి నుండి, వారు అధికారిపై అనుమానం వ్యక్తం చేశారు. సంఘటన జరగడానికి కొన్ని గంటల ముందు అతను బాధితురాలి బెడ్‌రూమ్‌ను కూడా సందర్శించాడు. పోలీసులు కేసులో కుంటుంబ సభ్యులందరిపై అనుమానం వ్యక్తం చేస్తూ కేసు నమోదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా ఇంటికి వచ్చిన అందరినీ ప్రశ్నించారు. కుటుంబ సభ్యులు అధికారి పేరు పెట్టినప్పటికీ, అతను ఎప్పుడూ ఇలాంటి అవమానకరమైన చర్యకు పాల్పడతాడని పోలీసులు సైతం నమ్మలేకపోయారు. పైగా వారంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ కూడాను. అయితే, పోలీసులు సదరు కానిస్టేబుల్‌ని ప్రశ్నించడంతో అసలు విషయం బట్టబయలైంది. ప్రైవేట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టిన ఆభరణాలను స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించారు. అయితే, నిందితుడు ఆన్‌లైన్ రమ్మీ గేమ్‌లు ఆడుతూ..భారీగా నష్టపోయినట్టుగా గుర్తించారు. చోరీకి పాల్పడిన కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు..మరేదైనా నేరాలలో ప్రమేయం ఉందా..? అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఇటీవలే నరబలి కేసును ఛేదించిన కొచ్చి సిటీ పోలీసుల ప్రతిష్టను ఇప్పుడు ఈ కానిస్టేబుల్‌ చోరీ ఘటన మరింత మసకబార్చింది. నిజంగా ఇది పోలీసులకు గడ్డుకాలంగా మారింది. మరోవైపు కొందరు అధికారులు డిపార్ట్‌మెంట్‌పై ప్రశంసలు అందుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. మరికొందరు ప్రతిష్టను దిగజార్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో, కొట్టాయంలోని కంజిరపల్లి వద్ద అర్ధరాత్రి పుష్కరాల నుండి 10 కిలోల మామిడి పండ్లను దొంగిలించిన పోలీసు అధికారి సిసి కెమెరాలో చిక్కుకున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి