Muruga Mutt: లైంగిక వేధింపుల కేసులో.. లింగాయత్ మఠాధిపతికి 4 రోజుల పోలీసు కస్టడీ..

గురువారం రాత్రి స్వామీజీని అరెస్ట్‌ చేసిన తరువాత నేరుగా ఆస్పత్రికి వీల్‌చైర్‌లో తరలించడంపై విమర్శలు వెలువెత్తాయి. మెడికల్‌ రిపోర్ట్‌పై విమర్శలు రావడంతో స్వామీజీని హాజరుపర్చాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Muruga Mutt: లైంగిక వేధింపుల కేసులో.. లింగాయత్ మఠాధిపతికి 4 రోజుల పోలీసు కస్టడీ..
Shivamurthy Murugha Sharanaru

Updated on: Sep 02, 2022 | 6:41 PM

Shivamurthy Murugha Sharanaru: చిత్రదుర్గలోని లింగాయత్‌ ఆశ్రమంలో మైనర్‌ బాలికలపై రేప్‌ కేసులో శివమూర్తి మురుగ శరణారు స్వామీజీకి న్యాయస్థానం నాలుగు రోజుల పోలీసు కస్టడీ విధించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్వామీజీని కోర్టుకు తీసుకొచ్చారు పోలీసులు. శివమూర్తి స్వామీజీపై పోక్సో చట్టం కింద కేసు నమోదయ్యింది. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. స్వామీజీ మెడికల్‌ రిపోర్ట్‌పై కూడా కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అత్యవసర పరిస్థితుల్లోనే స్వామీజీకి హాస్పిటల్‌లో చికిత్సను అందించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. గురువారం రాత్రి స్వామీజీని అరెస్ట్‌ చేసిన తరువాత నేరుగా ఆస్పత్రికి వీల్‌చైర్‌లో తరలించడంపై విమర్శలు వెలువెత్తాయి. మెడికల్‌ రిపోర్ట్‌పై విమర్శలు రావడంతో స్వామీజీని హాజరుపర్చాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో స్వామిజీని కోర్టులో హాజరుపర్చగా.. నాలుగురోజుల కస్టడీ విధిస్తూ ఆదేశాలిచ్చింది. దీంతో శివమూర్తి స్వామీజీని పోలీసులు బెంగళూర్‌కు తరలించి విచారించే అవకాశాలున్నాయి.

కాగా.. మఠంలో తమపై అత్యాచారం జరిగిందని బాధిత బాలికలు పోలీసులకు ఫిర్యాదుచేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మఠం నడుపుతున్న పాఠశాలలో చదువుతున్న 15, 16 ఏళ్ల బాలికలపై మూడురేళ్లకుపైగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు పేర్కొన్నారు. ఆశీర్వాదం పేరుతో శివమూర్తి స్వామి ప్రతివారం పిలిపించి లైంగికంగా వేధించేవాడని ఇద్దరు బాలికలు ఆరోపించారు. అనంతరం ఈ ఘటనపై పలు పార్టీలు, సంఘాలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశాయి. దీంతో కర్ణాటక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

ఈ కేసులో మఠాధిపతి, హాస్టల్ వార్డెన్‌తో సహా మొత్తం ఐదుగురు నిందితులుగా ఉన్నారు. స్వామీజీని అరెస్ట్ చేయడానికి ముందు ఈ కేసులో హాస్టల్ వార్డెన్ రష్మీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సున్నితమైన అంశం కావడంతో చిత్రదుర్గలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి, అదనపు బలగాలను రప్పించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..