మహారాష్ట్రలో శివసేన నేతలతో రాజకీయ వివాదం తెచ్చుకున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆదివారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీతో భేటీ అయింది. రాజ్ భవన్ లో జరిగిన ఈ భేటీ వివరాలు తెలియలేదు. అయితే ముంబైలో తన ఆఫీసును మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేయడం, శివసేన నేత సంజయ్ రౌత్ కి తనకు మధ్య తలెత్తిన గొడవను, ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు తనను ముంబైలో అడుగు పెట్టనివ్వబోమంటూ చేసిన హెచ్ఛరికలను కంగనా ఈ సమావేశంలో గవర్నర్ దృష్టికి తెచ్చినట్టు సమాచారం. కాగా ఈమెకు చెందిన కార్యాలయాన్ని మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కూల్చివేయడంపై గవర్నర్ కోష్యారీ …..సీఎం ఉధ్ధవ్ థాక్రే పొలిటికల్ అడ్వైజర్ ని పిలిపించి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది.
అటు-కంగనా రాజ్ భవన్ కి వెళ్తుండగా ఆమె నివాసం వద్ద ఆలిండియా పాంథర్ సేన నిరసన ప్రదర్శన నిర్వహించింది. దళిత సంస్థ అయిన ఈ విభాగం ఇటీవల కంగనా చేసిన ట్వీట్లకు ప్రొటెస్ట్ చేసింది.