హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రస్థావరం గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్..
జమ్ముకశ్మీర్లో ఉగ్రవేట కొనసాగుతోంది. నిత్యం లోయలో ఏదో ఓ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరగడం కానీ.. ఉగ్రవాదులను పట్టుకోవడమో జరుగుతోంది. బుద్గాం జిల్లాలో సోమవారం నాడు రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన 53 బెటాలియన్, సీఆర్పీఎఫ్కు..
జమ్ముకశ్మీర్లో ఉగ్రవేట కొనసాగుతోంది. నిత్యం లోయలో ఏదో ఓ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరగడం కానీ.. ఉగ్రవాదులను పట్టుకోవడమో జరుగుతోంది. బుద్గాం జిల్లాలో సోమవారం నాడు రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన 53 బెటాలియన్, సీఆర్పీఎఫ్కు చెందిన 181 బెటాలియన్, ఇండియన్ ఆర్మీ సంయుక్తంగా కూంబింగ్ చేపట్టారు. ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారం అందడడంతో.. జిల్లాలోని పాకేర్పొరా ప్రాంతంలో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ముగ్గురు హిజ్బుల్ ముజాహిద్దీన్కు చెందిన ఉగ్రవాదులు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
కాగా, పట్టుబడ్డ ఉగ్రవాదులను మెహ్రాజ్దిన్ కుమారన్, తాహీర్ కుమార్, సాహిల్ హుర్రాగా గుర్తించారు. వీరిలో మెహ్రాజ్దిన్ కుమారన్, తాహీర్ కుమార్లు పాకేర్పొరా ప్రాంతానికి చెందిన వారిగా గుర్తుపట్టారు. ఇక మరో ఉగ్రవాది సాహిల్ హుర్రా తిల్సరా ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తించారు. వీరి వద్ద నుంచి 20 రౌండ్ల ఏకే-47 గన్స్తో పాటు.. రెండు డిటోనేటర్స్,15 పోస్టర్స్తో సహా.. పలు ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
Jammu and Kashmir: Budgam Police, Indian Army’s 53 Bn Rashtriya Rifles and 181 Bn CRPF busted a Hizbul Mujahideen terror module and arrested 3 terror associates and seized 20 live rounds AK-47, 2 detonators and 15 posters from Pakherpora area today.
— ANI (@ANI) July 20, 2020