పర్యాటక ప్రియులకు గొప్ప శుభవార్త.. 2 నెలల ప్రయాణం, 45 వేల మందితో.. అందుబాటులోకి అంతర్జాతీయ క్రూయిజ్‌

|

Nov 06, 2023 | 11:19 AM

రాజ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం, గంగా విలాస్‌లో 18 లగ్జరీ సూట్లు ఉన్నాయి. 36 మంది ప్రయాణికులకు వసతి సౌకర్యం ఉంది. 2 పడకల సూట్‌కు రోజువారీ అద్దె దాదాపు రూ.50 వేలు. గంటకు 20 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ క్రూయిజ్ ప్రతిరోజూ 100 నుంచి 150 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. దాని 14 మంది సభ్యుల మెరైన్ సిబ్బంది పూర్తి శిక్షణ పొంది ఉన్నారు. దాని రెండవ అంతస్తులో వీల్ హౌస్ నిర్మించారు. విహారయాత్రలో ప్రయాణికులకు..

పర్యాటక ప్రియులకు గొప్ప శుభవార్త.. 2 నెలల ప్రయాణం, 45 వేల మందితో.. అందుబాటులోకి అంతర్జాతీయ క్రూయిజ్‌
1st Intl Cruise Liner Costa
Follow us on

లోతైన నీలి సముద్రం, నీలి ఆకాశం, ప్రవహించే నీరు ఎటు చూసిన మన కళ్లకు మెరుస్తూ కనిపిస్తుంది. చుట్టూ వీచే చల్లని గాలి గిలిగింతలు పెడుతుంటే.. ఆ ఆనందాన్ని ఆస్వాదించాలనే గానీ, చెబితే మాటలు సరిపోవు.. ఇది క్రూయిజ్ టూర్ విశిష్టత… మీరు మీ దేశాన్ని సముద్ర తీరంలో చూడాలనుకుంటే సిద్ధంగా ఉండండి. అంతర్జాతీయ క్రూయిజ్ లైనర్ ‘కోస్టా మెరీనా’ భారత్‌లో పర్యాటక ప్రియులను అలరించేందుకు రెడీగా ఉంది. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ముంబైలో తన తొలి ప్రయాణానికి కంపెనీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కోస్టా క్రూయిజ్‌లు 2 నెలల పాటు సముద్రంలో ప్రయాణిస్తాయని, ఇందులో దాదాపు 45 వేల మంది ప్రయాణించవచ్చు. ఈ క్రూయిజ్ ఎక్కువగా ముంబై, గోవా, లక్షద్వీప్, కొచ్చిన్ చుట్టూ అందుబాటులో ఉంటుంది.

గంగా విలాస్ క్రూయిసెస్, దేశం, ప్రపంచవ్యాప్తంగా పర్యటనలు జరుపుతుంది. ప్రస్తుతం అది మరోమారు ప్రయాణం మొదలుపెట్టింది. కోల్‌కతా నుంచి బయల్దేరిన క్రూయిజ్‌కు ఒకరోజు ధర రూ.50 వేలు. వారణాసి నుంచి దిబ్రూగఢ్‌కు 51 రోజుల ప్రయాణానికి రూ. 25 లక్షలు టిక్కెట్. జనవరి 13, 2023న ఈ క్రూయిజ్‌ని వారణాసి నుండి డిబ్రూగఢ్ (అసోం)కి నడిపించారు. ఈ క్రూయిజ్‌ తన తొలి ప్రయాణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సిఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర షిప్పింగ్ జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ జెండా ఊపి ప్రారంభించారు. గంగా విలాస్ క్రూజ్ విలాసవంతమైన సౌకర్యాలతో కూడిన ఆధునిక క్రూయిజ్‌గా అభివర్ణించారు ఈ క్రూయిజ్‌ను నిర్వహిస్తున్న హెరిటేజ్ రివర్ జర్నీ మేనేజింగ్ డైరెక్టర్ రాజ్ సింగ్.

ఇవి కూడా చదవండి

గంగా విలాస్‌లో 14 మంది సిబ్బంది..

రాజ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం, గంగా విలాస్‌లో 18 లగ్జరీ సూట్లు ఉన్నాయి. 36 మంది ప్రయాణికులకు వసతి సౌకర్యం ఉంది. 2 పడకల సూట్‌కు రోజువారీ అద్దె దాదాపు రూ.50 వేలు. గంటకు 20 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ క్రూయిజ్ ప్రతిరోజూ 100 నుంచి 150 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. దాని 14 మంది సభ్యుల మెరైన్ సిబ్బంది పూర్తి శిక్షణ పొంది ఉన్నారు. దాని రెండవ అంతస్తులో వీల్ హౌస్ నిర్మించారు. విహారయాత్రలో ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. వారి భద్రతపై కూడా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్రూయిజ్ దిగిన తర్వాత, ప్రయాణికులు ఆయా నగరాన్ని కూడా సందర్శించవచ్చు. ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తకుండా ఏర్పాట్లు కూడా చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..