ప్రపంచ ఆర్ధిక సంక్షోభంలోనూ భారత్‌దే ముందడుగు.. ప్రధాని మోదీ నిర్ణయాలే అందుకు కారణమా..

|

Sep 12, 2024 | 7:06 PM

రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ఈ యుద్ధం చాలా దేశాల ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసింది. కానీ భారత్ మాత్రం..

ప్రపంచ ఆర్ధిక సంక్షోభంలోనూ భారత్‌దే ముందడుగు.. ప్రధాని మోదీ నిర్ణయాలే అందుకు కారణమా..
Pm Modi
Follow us on

రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ఈ యుద్ధం చాలా దేశాల ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసింది. కానీ భారత్ మాత్రం ఈ విపత్కర పరిస్థితుల్లోనూ మెరుగ్గా రాణించింది. పలు దేశాలకు అండగా నిలుస్తూ.. ఆర్ధికంగా స్థిరంగా కొనసాగుతోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో భారత్.. స్థిరంగా ఉండేందుకు ప్రధాన కారణం దౌత్యపరమైన అవగాహన.

ఇది చదవండి: శ్వాసలో దుర్వాసన, దగ్గుతో ఆస్పత్రికెళ్లిన వ్యక్తి.. CT స్కాన్ చేయగా బిత్తరపోయిన వైద్యులు

యూరోపియన్ దేశాలకు రష్యా చమురు సరఫరాను నిలిపివేసిన తర్వాత.. ఇతర వనరులను వెతికే పనిలో పడ్డారు. దీని కారణంగా ప్రపంచ మార్కెట్‌లో చమురు డిమాండ్ విపరీతంగా పెరిగింది. అలాగే చమురు ధరలు కూడా అమాంతం పెరిగాయి. దీని ప్రభావం భారత్‌పై కూడా ప్రత్యక్షంగా పడింది. ద్రవ్యోల్బణం, దిగుమతుల సంక్షోభం ఏర్పడింది. దీనికి కారణంగా భారత్ తన చమురు సరఫరాలో 80 శాతం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దౌత్యం ద్వారా ఈ విపత్కర పరిస్థితుల్లో నిలదొక్కుకుంది. పాశ్చాత్య దేశాలతో తమ బంధాన్ని సమతుల్యం చేస్తూ భారతదేశం చమురును దిగుమతి చేయడం ప్రారంభించింది. ఫలితంగా ప్రపంచ సంక్షోభం ఉన్నప్పటికీ దేశ ప్రభుత్వం స్థిరంగా ఉంది. రష్యాపై వివిధ దేశాల నుంచి అనేక ఆంక్షలు ఉన్నప్పటికీ, భారతదేశం చౌకగా చమురును కొనుగోలు చేస్తూ వస్తోంది. ఇది భారతదేశ ఆర్ధిక కోణాన్ని మరింతగా పెంచింది. దీని వల్ల దేశీయ ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది.

ఇది చదవండి: రసికులకే పాఠాలు చెప్పి.. ఏకంగా ఎన్ని కోట్లు సంపాదించాడో తెల్సా

మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం చమురు ధరలపై ప్రధానంగా ప్రభావం చూపింది. దీని కారణంగా చమురు ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. ఈ పరిస్థితి భారతదేశానికి పెద్ద సవాలుగా మారింది. కానీ రష్యా నుంచి తక్కువ ధరకు చమురును కొనుగోలు చేయడంతో కేంద్ర ప్రభుత్వం ఈ విపత్కర పరిస్థితిని అదుపులో ఉంచింది. దీని వల్లే దేశంలో చమురు ధరలు కంట్రోల్‌లో ఉన్నాయి. అలాగే పలు రాయితీల ద్వారా వినియోగదారులపై ద్రవ్యోల్బణం భారాన్ని తగ్గించింది మోదీ సర్కార్. ఒకవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఉన్నప్పటికీ.. ప్రధాని మోదీ ఏకాభిప్రాయం.. భారతదేశ ఖ్యాతిని ఆర్ధిక సంక్షోభం నుంచి కాపాడటంలో దోహదపడింది. చమురు సరఫరా, ధరల నియంత్రణను అదుపులో ఉంచడం, దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచడంలో ప్రభుత్వం అద్భుత విజయం సాధించిందనే చెప్పాలి.

ఇది చదవండి: తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికెళ్లిన మహిళ.. స్కాన్ చేసి చూడగా దిమ్మతిరిగింది

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..