AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ రెండు దేశాలపై భారత్ మండిపాటు.. ఎందుకు ?

మలేసియా, టర్కీ దేశాలపై భారత్ మండిపడింది. ముఖ్యంగా ఈశాన్య సిరియాలో టర్కీ ఏకపక్షంగా సైనిక దాడులకు దిగడాన్ని తీవ్రంగా ఖండించింది. టర్కీ చర్య ఆ ప్రాంతంలో సుస్థిరతకు భంగం కలిగించేదిగానే కాక, ఉగ్రవాదంపై [పోరుకు వ్యతిరేకంగా ఉందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ఓ స్టేట్ మెంట్ లో పేర్కొన్నారు. సంయమనంతో వ్యవహరించాలని, సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ఈ శాన్య సిరియాలో కుర్దిష్ మిలిటెంట్లపై తమ దేశ దళాలు జరిపిన […]

ఆ రెండు దేశాలపై భారత్ మండిపాటు.. ఎందుకు ?
Pardhasaradhi Peri
|

Updated on: Oct 12, 2019 | 4:11 PM

Share

మలేసియా, టర్కీ దేశాలపై భారత్ మండిపడింది. ముఖ్యంగా ఈశాన్య సిరియాలో టర్కీ ఏకపక్షంగా సైనిక దాడులకు దిగడాన్ని తీవ్రంగా ఖండించింది. టర్కీ చర్య ఆ ప్రాంతంలో సుస్థిరతకు భంగం కలిగించేదిగానే కాక, ఉగ్రవాదంపై [పోరుకు వ్యతిరేకంగా ఉందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ఓ స్టేట్ మెంట్ లో పేర్కొన్నారు. సంయమనంతో వ్యవహరించాలని, సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ఈ శాన్య సిరియాలో కుర్దిష్ మిలిటెంట్లపై తమ దేశ దళాలు జరిపిన దాడుల్లో 100 మందికి పైగా మిలిటెంట్లు హతులయ్యారని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఇటీవల ప్రకటించారు. సిరియా నుంచి పాక్షికంగా అమెరికా తన దళాలను కొన్నింటిని ఉపసంహరించుకున్న అనంతరం టర్కీ భద్రతా దళాలు సిరియాపై దూసుకుపోయాయి. కాగా-కాశ్మీర్ పై పాకిస్తాన్ వైఖరిని సమర్థించిన మలేసియా ప్రధాని మహాతిర్ మహ్మద్ తీరును కూడా ఇండియా ఖండించింది. ఇటీవల ఐరాస సమావేశాల సందర్భంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. ఆయనను కలిసి కాశ్మీర్ పై తమ వాదనకు మద్దతు నివ్వవలసిందిగా కోరగా..మహాతిర్ సానుకూలంగా స్పందించారు. దీంతో ఇండియా ఆగ్రహం వ్యక్తం చేసింది. అటు-ఐరాస సమ్మిట్ సందర్భంలో ప్రధాని మోదీ.. టర్కీ శత్రు దేశాలైన సైప్రస్, గ్రీస్, ఆర్మేనియా దేశాల అధినేతలను కలిసి ఈ విషయమై చర్చించారు. ఈ అంశంపై భారత వైఖరిని వారికి వివరించారు.

ఇలా ఉండగా.. మలేసియా, టర్కీ దేశాలనుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ఆంక్షలు విధిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. కాశ్మీర్ విషయంలో ఆ దేశాలు భారత్ ను విమర్శించిన నేపథ్యంలో.. ఈ చర్య తీసుకోవడం విశేషం. ఈ రెండు దేశాల నుంచి ముఖ్యంగా పామాయిల్ ఇండియాకు దిగుమతి అవుతోంది. ప్రధానంగా మలేసియా నుంచి మూడు వంతుల పామాయిల్ మన దేశానికి దిగుమతి అవుతోంది. కానీ.. ఈ దిగుమతులకు స్వస్తి చెబుతూ ప్రత్యామ్నాయంగా ఇండోనేసియా, అర్జెంటీనా, ఉక్రెయిన్ దేశాల నుంచి పామాయిల్ ని ఇంపోర్ట్ చేసుకోవడానికి అప్పుడే చర్యలు చేపట్టారు. ఇది మలేసియాకు షాకే..!

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?