India Covid-19: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గత 24గంటల్లో ఎన్నంటే..?

India Coronavirus Updates: దేశంలో కరోనావైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా థర్డ్‌వేవ్ ప్రారంభంలో ఎన్నడూ లేని విధంగా రోజువారి కేసులు మూడు లక్షలకు పైగా

India Covid-19: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గత 24గంటల్లో ఎన్నంటే..?

Updated on: Feb 17, 2022 | 9:27 AM

India Coronavirus Updates: దేశంలో కరోనావైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా థర్డ్‌వేవ్ ప్రారంభంలో ఎన్నడూ లేని విధంగా రోజువారి కేసులు మూడు లక్షలకు పైగా నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోవిడ్ (Coronavirus) కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో (బుధవారం) దేశవ్యాప్తంగా నిన్న 30,615 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 541 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారంతో పోల్చుకుంటే.. కరోనా కేసుల సంఖ్య 142 కేసులు పెరిగాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry) గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 2.61 శాతంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది.

దేశంలో 3,32,918 కేసులు యాక్టివ్‌గా (Active cases) ఉన్నాయి. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మహమ్మారి కేసుల 4,27,54,315 కి చేరగా.. ఇప్పటివరకు కరోనా నుంచి 5,10,413 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారని కేంద్రం తెలిపింది.

కాగా.. నిన్న కరోనా (Covid-19) మహమ్మారి నుంచి 67,538 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,19,10,984 కి పెరిగింది. కాగా.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 1,74,24,36,288 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

నిన్న దేశవ్యాప్తంగా 11,79,705 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటితో కలిపి ఇప్పటివరకు 75,55,32,460 కరోనా పరీక్షలు చేసినట్లు కేంద్రం తెలిపింది.

Also Read:

CM KCR Birthday: సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?

TTD Temple: నేడు టీటీడీ బోర్డు కీలక సమావేశం.. 2022-23 టీటీడీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న పాలక మండలి..