India Covid-19: కేరళలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. దేశంలో భారీగా పెరిగిన మరణాలు.. నిన్న ఎన్నంటే..?

India Coronavirus Updates: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మళ్లీ పెరుగుతున్న కేసులు ఆందోళనకు గురిచేశాయి. అయితే..

India Covid-19: కేరళలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. దేశంలో భారీగా పెరిగిన మరణాలు.. నిన్న ఎన్నంటే..?
India Corona Deaths

Updated on: Sep 29, 2021 | 9:48 AM

India Coronavirus Updates: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మళ్లీ పెరుగుతున్న కేసులు ఆందోళనకు గురిచేశాయి. అయితే.. కొన్ని రోజులుగా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 18,870 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా 378 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,37,16,451 కి పెరగగా.. మరణాల సంఖ్య 4,47,751 కి చేరింది. నిన్న కరోనా నుంచి 28,178 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి దేశంలో ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,29,86,180 కి పెరిగినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 2,82,520 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కేరళ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిన్న దేశంలో నమోదైన కరోనా కేసుల్లో కేరళలో 11,196 కేసులు నమోదు కాగా.. 149 మంది మరణించారు.

ఇదిలాఉంటే.. నిన్న దేశవ్యాప్తంగా 15,04,713 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ వెల్లడించింది. వీటితో కలిపి ఇప్పటివరకు దేశంలో 56,74,50,185 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది.

Also Read:

Ganja Nursery: విల్లాలో గంజాయి సాగు.. ఎంబీఏ కోసం భారత్‌కు వచ్చి రూ.కోట్లల్లో వ్యాపారం.. చివరకు..

Vaccine: కోవిడ్ వ్యాక్సిన్‌ కోసం వెళితే.. రేబిస్‌ వ్యాక్సిన్‌ ఇచ్చారు.. ఆ తర్వాత ఏమైందంటే..?