Meerut Case: జైలులో గర్భం దాల్చిన ముస్కాన్‌! ఆ బిడ్డకు తండ్రి ఎవరంటే..?

మీరట్‌లో జరిగిన దారుణ హత్య కేసులో నిందితురాలు ముస్కాన్ గర్భవతి అని తేలింది. తన భర్త సౌరభ్‌ను చంపి, శవాన్ని డ్రమ్ములో దాచి, సిమెంట్‌తో కప్పిన ముస్కాన్ ప్రియుడితో కలిసి హిమాచల్‌ ప్రదేశ్‌కు పారిపోయింది. ప్రస్తుతం జైలులో ఉన్న ఆమె ఆరోగ్యం క్షీణించడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా గర్భం నిర్ధారణ అయింది. బిడ్డ తండ్రి ఎవరనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.

Meerut Case: జైలులో గర్భం దాల్చిన ముస్కాన్‌! ఆ బిడ్డకు తండ్రి ఎవరంటే..?
Meerut Case

Updated on: Apr 07, 2025 | 7:11 PM

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి, మృతదేహాన్ని డ్రమ్ములో వేసి సిమెంట్‌ కప్పిన దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మీరట్‌లో జరిగిన ఈ హత్యకు సంబంధించి.. నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు కూడా తరలించారు. తాజాగా భర్తను చంపిన ముస్కాన్‌ గర్భవతి అని తేలింది. జైలులో ఆమె కాస్త అనారోగ్యానికి గురికావడంతో పోలీసులు వైద్య పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో ఆమె గర్భవతి అని నిర్ధారణ అయింది. ముస్కాన్‌ గర్భం దాల్చి ఎన్ని రోజులు అయిందో ఇంకా స్పష్టంగా తెలియదు, కానీ ఆమె ఒకటి నుండి ఒకటిన్నర నెలల క్రితం గర్భవతి అయి ఉండవచ్చని అంచనా.

ఆమె 17 రోజులుగా జైలులోనే ఉంది. మార్చి 3న తన భర్త సౌరభ్ రాజ్‌పుత్‌ను హత్య చేసిన తర్వాత, ఆమె తన ప్రేమికుడు సాహిల్‌తో కలిసి హిమాచల్ ప్రదేశ్‌లో 11 రోజులు ఉంది. హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటిస్తున్నప్పుడు ముస్కాన్ సాహిల్‌ను వివాహం చేసుకున్నానని చెబుతోంది. అంతకు ముందు కూడా ఆమె సాహిల్‌తో చాలా కాలంగా పరిచయం కలిగి ఉంది. మీరట్ జైలులో రెండు రోజుల క్రితం ఆమె ఆరోగ్యం క్షీణించింది. దీంతో పోలీసులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ ఆమెను పరీక్షించగా, ఆమె గర్భవతి అని తేలింది.

అయితే అల్ట్రాసౌండ్ స్కానింగ్‌ తర్వాత ఆమె గర్భం దాల్చి ఎన్ని రోజులు అవుతుందో స్పష్టంగా తెలుస్తుందని వైద్యులు అంటున్నారు. అయితే ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది. ఒక నెల క్రితం ఆమె తన భర్త సౌరభ్ రాజ్‌పుత్‌ను హత్య చేయడంతో ఈ ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. ముస్కాన్‌కు ప్రేమికుడు సాహిల్‌తో రెండేళ్లుగా పరిచయం ఉంది. దీంతో సాహిల్ బిడ్డను ముస్కాన్ తన గర్భంలో మోస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.