
చైనాలో వెలుగు చూసిన హ్యూమన్ మెటానిమో -HMPV వైరస్..అనుకున్న దాని కంటే వేగంగానే ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్లో ఇప్పటిదాకా నాలుగు HMPV వైరస్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో రెండు కర్ణాటక రాజధాని బెంగళూరులో కాగా.. మరో కేసును గుజరాత్లోని అహ్మదాబాద్లో గుర్తించారు. ఇక బెంగాల్ రాజధాని కోల్కతాలో మరో కేసును గుర్తించారు. ఐదు నెలల చిన్నారికి.. HMPV పాటిజివ్గా తేలింది. ఈ విషయాలను ఐసీఎంఆర్ వెల్లడించింది. ఇప్పటికే బెంగళూరులో 3, 8 నెలల వయసు కలిగిన ఇద్దరు చిన్నారులకు ఈ హెచ్ఎంపీవీ వైరస్ పాజిటివ్గా తేలగా.. అహ్మదాబాద్లో 2 నెలల చిన్నారికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారించింది. ప్రస్తుతం చిన్నారుల పరిస్థితి నిలకడగా ఉందంటున్నారు డాక్టర్లు. చిన్నారుల్లో ఎలాంటి లక్షణాలు బయటపడలేదని ICMR చెబుతోంది. పలువురు చిన్నారులకు టెస్ట్ చేసిన సమయంలో వైరస్ బయటపడిందన్న ICMR పేర్కొంది. మరోవైపు కరోనా వేరియంట్లలాగే HMPV వైరస్ ఉపిరి తిత్తులను టార్గెట్ చేస్తుంది. జలుబు, దగ్గు, శ్లేష్మం, జ్వరం…ప్రస్తుతం ప్రపంచం కరోనాతో ఎఫెక్టయి ఊపిరితిత్తులు పూర్తిగా బలహీనపడ్డాయి..మరి ఈటైమ్లో ఈకొత్త వైరస్ మరింత ప్రభావం చూపుతుందా…అసలు చైనాలో ఏం జరుగుతోంది…మన దేశం ఏం చేయబోతోంది.. తెలుసుకుందాం..! దేశవ్యాప్తంగా నలుగురికి పాజిటివ్ కొత్త వైరస్ బెంగళూరులో 8 నెలల చిన్నారి, 3 నెలల చిన్నారిలో HMPV ఇన్ఫెక్షన్ కనుగొన్నారు వైద్యులు. గుజరాత్లో 2 నెలల చిన్నారికి HMPV సోకినట్లు గుర్తించారు. కోల్కతాలో మరో చిన్నారికి చైనా...