AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కండోమ్ లు, గర్భనిరోధక మాత్రల వినియోగం పెరిగాయి.. వాటి సంఖ్య తగ్గాయి.. నివేదికలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్..

కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ సమయంలో కండోమ్‌లు, గర్భ నిరోధక మాత్రల అమ్మకాలు పెరిగాయి. తాజాగా.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక విషయాలు వెల్లడించింది...

కండోమ్ లు, గర్భనిరోధక మాత్రల వినియోగం పెరిగాయి.. వాటి సంఖ్య తగ్గాయి.. నివేదికలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్..
Birth Control Pills
Ganesh Mudavath
|

Updated on: Jan 29, 2023 | 11:06 AM

Share

కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ సమయంలో కండోమ్‌లు, గర్భ నిరోధక మాత్రల అమ్మకాలు పెరిగాయి. తాజాగా.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక విషయాలు వెల్లడించింది. ఆడ, మగ వారిలో స్టెరిలైజేషన్ (పిల్లలు పుట్టకుండా చేసే నివారణ సర్జరీ ) బాగా పడిపోయిందని తెలిపారు. హెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (HMIS) నివేదిక ప్రకారం.. 2021-22లో స్టెరిలైజేషన్‌లు అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 25 శాతం తగ్గాయని వెల్లడించింది. కండోమ్ పంపిణీ ఏడు శాతం పెరిగిందని, అంతే కాకుండా గర్భనిరోధక మాత్రల వినియోగం రెండింతలు పెరిగిందని వివరించింది. మహమ్మారి ఉన్నప్పటికీ.. 2020-21తో పోలిస్తే కండోమ్ పంపిణీ 7.2 శాతం పెరిగిందని పేర్కొ్ంది. ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. కండోమ్‌ల పంపిణీలో బెంగాల్ అగ్రగామిగా ఉంది. గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, జార్ఖండ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

2020-21లో 31.45 కోట్లతో పోలిస్తే 2021-22లో 33.70 కోట్ల యూనిట్ల కండోమ్‌లు అమ్ముడయ్యాయి. లాక్‌డౌన్‌కు ముందు 2018-19లో అత్యధికంగా 34.44 కోట్ల మార్కును తాకింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కోవిడ్-19 మహమ్మారి సమయంలో గర్భ నిరోధక మాత్రల వినియోగం కూడా పెరిగింది. 2020-21లో 57.1 లక్షలతో పోలిస్తే 2021-22లో 76.5 లక్షల గర్భనిరోధక మాత్రలు పంపిణీ అయ్యాయి. 2018-19 లో కేవలం 14.1 లక్షల మాత్రలు మాత్రమే పంపిణీ చేశారు. ఈ మాత్రలకు ఎక్కువ డిమాండ్ ఉత్తరప్రదేశ్ నుండి వచ్చింది. తరువాత పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఉన్నాయి.

మరోవైపు.. స్టెరిలైజేషన్ క్షీణించింది. 2019-20లో 33.52 లక్షల నుండి 2021-22లో 26.97 లక్షలకు పడిపోయింది. 2021-22లో పురుషులు స్టెరిలైజేషన్ (33,635) గా ఉంటే.. ఇది 2020-21 (26,424) నుంచి 27 శాతం మెరుగుపడినప్పటికీ.. 2019-20 (54,239)తో పోలిస్తే 38 శాతం తగ్గింది. మహారాష్ట్ర అత్యధికంగా పురుషుల స్టెరిలైజేషన్‌లను నమోదు చేసింది. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఉన్నాయి. స్త్రీల స్టెరిలైజేషన్ 26.71 లక్షల నుండి 29.75 లక్షలకు పెరిగింది. 2019-20లో 32.98 లక్షలు నమోదు చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

ఆ గ్రామంలో కుప్పలు తెప్పులుగా కోతుల గుంపులు.. బయటకెళ్లేందుకు..
ఆ గ్రామంలో కుప్పలు తెప్పులుగా కోతుల గుంపులు.. బయటకెళ్లేందుకు..
మంచు విష్ణుకు తిరుచానూరు పోలీసుల నోటీసులు
మంచు విష్ణుకు తిరుచానూరు పోలీసుల నోటీసులు
మహాశివరాత్రి.. ఈరోజు శివుడికి ఆగ్రహం తెప్పించే ఈ తప్పులు చేయొద్దు
మహాశివరాత్రి.. ఈరోజు శివుడికి ఆగ్రహం తెప్పించే ఈ తప్పులు చేయొద్దు
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్‌‌
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్‌‌
UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే
UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్
ప్రపోజ్ డే.. ఇలా ప్రపోజ్ చేస్తే ఏ పిల్లైనా పడాల్సిందే గురూ..
ప్రపోజ్ డే.. ఇలా ప్రపోజ్ చేస్తే ఏ పిల్లైనా పడాల్సిందే గురూ..
మెడికల్ వర్సిటీలో కత్తితో దాడికి తెగబడ్డ 15 ఏళ్ల కుర్రాడు..!
మెడికల్ వర్సిటీలో కత్తితో దాడికి తెగబడ్డ 15 ఏళ్ల కుర్రాడు..!
కులాంతర వివాహం చేసుకున్న కూతురు.. తండ్రి ఏం చేశాడో తెలిస్తే..
కులాంతర వివాహం చేసుకున్న కూతురు.. తండ్రి ఏం చేశాడో తెలిస్తే..
24 ఏళ్లుగా ఒక్క హిట్టు లేదు.. అయినా వరుసగా 4 నేషనల్ అవార్డ్స్..
24 ఏళ్లుగా ఒక్క హిట్టు లేదు.. అయినా వరుసగా 4 నేషనల్ అవార్డ్స్..