Road Accident: దూసుకొచ్చిన మృత్యువు.. బైక్, ఆటోను ఢీకొట్టిన కారు.. ఆరుగురు దుర్మరణం..
వేగంగా దూసుకొచ్చిన కారు మోటార్సైకిల్ను, ఆటోరిక్షాను ఢీకొనడంతో ఇద్దరు బాలురుతో సహా ఆరుగురు వ్యక్తులు మరణించారని పోలీసులు తెలిపారు.
Gujarat Road Accident: గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుంది. కారు.. మోటార్సైకిల్ను, ఆటోరిక్షాను ఢీకొన్న ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటన గురువారం సాయంత్రం ఆనంద్ జిల్లాలోని సోజిత్రాలో చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు మోటార్సైకిల్ను, ఆటోరిక్షాను ఢీకొనడంతో ఇద్దరు బాలురుతో సహా ఆరుగురు వ్యక్తులు మరణించారని పోలీసులు తెలిపారు. సమచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాల స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఆనంద్ జిల్లా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోజిత్రా హైవేపై గురువారం సాయంత్రం వేగంగా వచ్చిన కియా సెల్టోస్ ఎస్యూవీ.. ఆటోరిక్షా, మోటార్సైకిల్ను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఆరుగురు మరణించారని తెలిపారు. మృతులను సోజిత్రాలోని నవగఢ్ గ్రామానికి చెందిన జియాబెన్ మిస్త్రీ (14), జాన్విబెన్ మిస్త్రీ (17), వారి తల్లి వినబెన్ మిస్త్రీ (44), యాసన్ వోహ్రా (38), ఆటోరిక్షా డ్రైవర్, యోగేష్ ఓడ్ (20), సందీప్ (19) గా గుర్తించారు.
ఈ ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడని, ఆ తర్వాత వెంటనే పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. డ్రైవర్, 42 ఏళ్ల కేతన్ పాధియార్పై నేరపూరిత నరహత్య కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాసన్ నడుపుతున్న ఆటోరిక్షాలో వినబెన్, జియా, జాన్వీలు ప్రయాణిస్తుండగా, యోగేష్, సందీప్ మోటార్సైకిల్పై ప్రయాణిస్తున్నారని ఆనంద్ పోలీసు సూపరింటెండెంట్ అజిత్ రాజియాన్ తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి