AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యువకుడితో చెల్లెలి ప్రేమాయనం.. అది తెలిసి అన్న ఏం చేశాడో తెలుసా?.. అస్సలు ఊహించలేరు!

గుజరాత్‌ రాష్ట్రంలోని భవానీనగర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. తన సోదరి వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుందన్న విషయం తెలిసుకున్న వ్యక్తి.. ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేసి ఆమెపై రెండు సార్లు అత్యాచారినికి పాల్పడ్డాడు. బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

యువకుడితో చెల్లెలి ప్రేమాయనం.. అది తెలిసి అన్న ఏం చేశాడో తెలుసా?.. అస్సలు ఊహించలేరు!
Gujarath Crime News
Anand T
|

Updated on: Aug 29, 2025 | 3:25 PM

Share

తన సోదరి మరొక వ్యక్తితో సంబంధం పెట్టుకుందన్న విషయం తెలుసుకున్న ఒక వ్యక్తి బ్లాక్‌ మెయిల్‌ చేసి ఆమెపై రెండు సార్లు అత్యాచారానికి పాల్పడిన గటన గుజరాత్‌ రాష్ట్రంలోని భవానీనగర్‌లో వెలుగు చూసింది. బాధితురాలి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. భవానీనగర్‌కు చెందిన ఒక వ్యక్తి స్థానికంగా డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి 22 ఏళ్ల సోదరి కూడా ఉంది. అయితే తన సోదరికి తమ గ్రామానికి చెందిన ఒక వ్యక్తితో ప్రేమాయనం నడిపిస్తున్నట్టు అతను తెలుసుకున్నాడు. వారిద్దరూ మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నట్టు గుర్తించాడు. మొదట అతనితో సంబంధం మానుకోమని ఆమెను బెదిరించాడు.

ఆ తర్వాత ఆదే విషయాన్ని అదునుగా చేసుకొని ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేయడం స్టార్ట్‌ చేశాడు. ఇలా బ్లాక్‌ మెయిల్‌ చేసి బెదిరించి తన సోదరిపై రెండు సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. జూలై 13న మొదటి సారి ఈ దారుణానికి పాల్పడ్డాడు.ఆ రోజు నిందితుడి భార్య తన తల్లిదండ్రులను చూడటానికి వెళ్ళినప్పుడు అతను తన సోదరిని కత్తితో బెదిరించి అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. రెండవ సంఘటన ఆగస్టు 22న అతని భార్య వ్యక్తిగత పని కోసం బయటకు వెళ్ళినప్పుడు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. రెండు సందర్భాలలోనూ బాధితురాలు ఇంట్లో ఒంటరిగానే ఉందని పోలీసులు తెలిపారు.

అయితే రెండవ సంఘటన తర్వాత ఆ మహిళ తనపై జరిగిన దాడులను పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలనుకుంది. వెంటనే రాష్ట్ర మహిళా హెల్ప్‌లైన్‌ను సంప్రదించి తనపై జరిగిన వేధింపులను ఫిర్యాదు చేసింది. దీంతో అధికారులు ఘటనపై భవానీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే రెండవ దాడి సమయంలో, నిందితుడు ఆమె కుడి తొడపై వెలిగించిన సిగరెట్‌ను గుచ్చాడని, దానితో తన తొడపై కాలిన గాయాలు అయ్యాయని బాధితురాలు ఆరోపించింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.దాడుల సమయంలో ఉపయోగించిన కత్తి, నిందితులు ధరించిన దుస్తులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.ఆ తర్వాత బాధితురాలికి, నిందితుడికి వైద్య పరీక్షలు నిర్వహించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం