AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యువకుడితో చెల్లెలి ప్రేమాయనం.. అది తెలిసి అన్న ఏం చేశాడో తెలుసా?.. అస్సలు ఊహించలేరు!

గుజరాత్‌ రాష్ట్రంలోని భవానీనగర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. తన సోదరి వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుందన్న విషయం తెలిసుకున్న వ్యక్తి.. ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేసి ఆమెపై రెండు సార్లు అత్యాచారినికి పాల్పడ్డాడు. బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

యువకుడితో చెల్లెలి ప్రేమాయనం.. అది తెలిసి అన్న ఏం చేశాడో తెలుసా?.. అస్సలు ఊహించలేరు!
Gujarath Crime News
Anand T
|

Updated on: Aug 29, 2025 | 3:25 PM

Share

తన సోదరి మరొక వ్యక్తితో సంబంధం పెట్టుకుందన్న విషయం తెలుసుకున్న ఒక వ్యక్తి బ్లాక్‌ మెయిల్‌ చేసి ఆమెపై రెండు సార్లు అత్యాచారానికి పాల్పడిన గటన గుజరాత్‌ రాష్ట్రంలోని భవానీనగర్‌లో వెలుగు చూసింది. బాధితురాలి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. భవానీనగర్‌కు చెందిన ఒక వ్యక్తి స్థానికంగా డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి 22 ఏళ్ల సోదరి కూడా ఉంది. అయితే తన సోదరికి తమ గ్రామానికి చెందిన ఒక వ్యక్తితో ప్రేమాయనం నడిపిస్తున్నట్టు అతను తెలుసుకున్నాడు. వారిద్దరూ మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నట్టు గుర్తించాడు. మొదట అతనితో సంబంధం మానుకోమని ఆమెను బెదిరించాడు.

ఆ తర్వాత ఆదే విషయాన్ని అదునుగా చేసుకొని ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేయడం స్టార్ట్‌ చేశాడు. ఇలా బ్లాక్‌ మెయిల్‌ చేసి బెదిరించి తన సోదరిపై రెండు సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. జూలై 13న మొదటి సారి ఈ దారుణానికి పాల్పడ్డాడు.ఆ రోజు నిందితుడి భార్య తన తల్లిదండ్రులను చూడటానికి వెళ్ళినప్పుడు అతను తన సోదరిని కత్తితో బెదిరించి అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. రెండవ సంఘటన ఆగస్టు 22న అతని భార్య వ్యక్తిగత పని కోసం బయటకు వెళ్ళినప్పుడు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. రెండు సందర్భాలలోనూ బాధితురాలు ఇంట్లో ఒంటరిగానే ఉందని పోలీసులు తెలిపారు.

అయితే రెండవ సంఘటన తర్వాత ఆ మహిళ తనపై జరిగిన దాడులను పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలనుకుంది. వెంటనే రాష్ట్ర మహిళా హెల్ప్‌లైన్‌ను సంప్రదించి తనపై జరిగిన వేధింపులను ఫిర్యాదు చేసింది. దీంతో అధికారులు ఘటనపై భవానీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే రెండవ దాడి సమయంలో, నిందితుడు ఆమె కుడి తొడపై వెలిగించిన సిగరెట్‌ను గుచ్చాడని, దానితో తన తొడపై కాలిన గాయాలు అయ్యాయని బాధితురాలు ఆరోపించింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.దాడుల సమయంలో ఉపయోగించిన కత్తి, నిందితులు ధరించిన దుస్తులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.ఆ తర్వాత బాధితురాలికి, నిందితుడికి వైద్య పరీక్షలు నిర్వహించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
2027 వన్డే ప్రపంచకప్‌కు కౌంట్‌డౌన్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ
2027 వన్డే ప్రపంచకప్‌కు కౌంట్‌డౌన్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ
వాట్సప్‌ వాడేవారికి అదిరిపోయే సూపర్ న్యూస్
వాట్సప్‌ వాడేవారికి అదిరిపోయే సూపర్ న్యూస్
GATE 2027 రిజిస్ట్రేషన్ చేయాలంటే DigiLocker తెరవాల్సిందే..!
GATE 2027 రిజిస్ట్రేషన్ చేయాలంటే DigiLocker తెరవాల్సిందే..!
ఈసారి అలాంటి పప్పులుడకవ్..కంటెస్టెంట్లకు నాగ్ స్ట్రాంగ్ వార్నింగ్
ఈసారి అలాంటి పప్పులుడకవ్..కంటెస్టెంట్లకు నాగ్ స్ట్రాంగ్ వార్నింగ్
బోనాల ప్రత్యేకం: తెలంగాణ ప్రజల ఇలవేల్పు మైసిగండి మైసమ్మ ఆలయం..
బోనాల ప్రత్యేకం: తెలంగాణ ప్రజల ఇలవేల్పు మైసిగండి మైసమ్మ ఆలయం..
కదులుతున్న రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఏం జరిగిందో తెలుసా!
కదులుతున్న రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఏం జరిగిందో తెలుసా!
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలెర్ట్..ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వాన
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలెర్ట్..ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వాన
త్రిషపై.. ఉదయనిధి షాకింగ్‌ కామెంట్స్‌.. తమిళనాడులో పెను దుమారం!
త్రిషపై.. ఉదయనిధి షాకింగ్‌ కామెంట్స్‌.. తమిళనాడులో పెను దుమారం!
రాహువు కటాక్షం..ఆ రాశుల వారికి కొత్త శుభ యోగాలు!
రాహువు కటాక్షం..ఆ రాశుల వారికి కొత్త శుభ యోగాలు!
నీట్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కేసుల రద్దుకు గ్రీన్ సిగ్నల్
నీట్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కేసుల రద్దుకు గ్రీన్ సిగ్నల్