
2013 అక్టోబరు 30… మహబూబ్నగర్ జిల్లా పాలెం దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం గుర్తుందా? తెల్లవారుఝామున వోల్వో బస్సుకు మంటలంటుకుని, 45 మంది ప్రయాణికులు గాఢనిద్రలో ఉండగానే కాలిబూడిదయ్యారు. ఒక్కరు కూడా మిగల్లేదు. అత్యంత విషాదకరమైన ఆ ఘటనకు కారణం అతివేగం, ప్లస్ బస్సు నిర్మాణ లోపం, ప్లస్ ట్రావెల్స్ కంపెనీ నిర్వాకం. పన్నెండేళ్ల తర్వాత గత ఏడాది నవంబర్లో అదే ట్రావెల్స్ బస్సులో మరో ట్రాజెడీ. రెండు నిండుప్రాణాలను బలితీసుకుంది. సో.. సమస్య ఎక్కడున్నట్టు? టోటల్ వ్యవస్థలోనే లోపం ఉందా? మరి, కడిగి శుద్ధి చెయ్యాల్సిందే కదా? అందుకే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్లోనే ఒక పెద్ద సంస్కరణ రాబోతోంది. కాకినాడ జిల్లా గండేపల్లి దగ్గర జాతీయ రహదారిపై ట్రాలీని ఢీకొట్టి మంటల్లో చిక్కుకుంది ఓ ట్రావెల్స్ బస్సు.. అదృష్టవశాత్తూ అరవై మంది ప్రయాణీకులూ సురక్షితంగా బయటపడ్డారు. అటు జమ్ము కాశ్మీర్ కుప్వారా జిల్లాలో మరో ఘోరం, భీకరమైన మంటలంటుకుని ఏకంగా ఏడు బస్సులు కాలి బూడిదయ్యాయి. ఇక ఢిల్లీ జైపూర్ హైవేపై టిప్పర్ను ఢీకొట్టి బస్సులో మంటలు అంటుకుని ఇద్దరు సజీవ దహనం అయ్యారు. ఘటనా స్థలంలో పెద్దపెట్టున ఆర్తనాదాలు, హాహాకారాలు వినిపించాయి. గురువారం (ఏప్రిల్ 09) తెల్లవారగానే దేశం నలుమూలల నుంచీ...