కశ్మీర్‌లో ఉగ్రవేట.. నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. విట్రిగామ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో.. భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. అయితే భద్రతా సిబ్బందిని గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ఎదురుకాల్పులు చేపట్టాయి. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతులు హిజ్బుల్ ముజాహిద్దీన్, లష్కరే తోయిబాకు చెందిన వారిగా గుర్తించారు. ఘటనాస్థలం నుంచి మరో ముగ్గురు ఉగ్రవాదులు తప్పించుకోవడంతో వారి కోసం.. సీఆర్పీఎఫ్ భద్రతా బలగాలు గాలింపు చేపడుతున్నాయి. Jammu and […]

కశ్మీర్‌లో ఉగ్రవేట.. నలుగురు ఉగ్రవాదులు హతం

Updated on: Mar 15, 2020 | 1:26 PM

జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. విట్రిగామ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో.. భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. అయితే భద్రతా సిబ్బందిని గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ఎదురుకాల్పులు చేపట్టాయి. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతులు హిజ్బుల్ ముజాహిద్దీన్, లష్కరే తోయిబాకు చెందిన వారిగా గుర్తించారు. ఘటనాస్థలం నుంచి మరో ముగ్గురు ఉగ్రవాదులు తప్పించుకోవడంతో వారి కోసం.. సీఆర్పీఎఫ్ భద్రతా బలగాలు గాలింపు చేపడుతున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us