ESI: ఈఎస్‌ఐ సభ్యులకు గుడ్‌న్యూస్ అందించిన కేంద్ర ప్రభుత్వం.. హైదరాబాద్‌ సహా 4 ప్రధాన నగరాల్లో ఆ సేవలు ప్రారంభం..!

|

Dec 04, 2021 | 7:06 PM

ESI HOSPITAL: దేశంలోని 4 ప్రధాన నగరాల్లోని ఉద్యోగుల కోసం ప్రభుత్వం శనివారం నాడు ప్రివెంటివ్ హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపిందర్ యాదవ్..

ESI: ఈఎస్‌ఐ సభ్యులకు గుడ్‌న్యూస్ అందించిన కేంద్ర ప్రభుత్వం.. హైదరాబాద్‌ సహా 4 ప్రధాన నగరాల్లో ఆ సేవలు ప్రారంభం..!
Esi Health Check Up
Follow us on

ESI Health Check Up: ESIC నుంచి బీమా పొందిన ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం పెద్ద సౌకర్యాన్ని ప్రారంభించింది. దేశంలోని 4 ప్రధాన నగరాల్లోని ఉద్యోగుల కోసం ప్రభుత్వం శనివారం నాడు ప్రివెంటివ్ హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపిందర్ యాదవ్ ఈ కొత్త సౌకర్యాన్ని ప్రారంభించారు. 40 ఏళ్లు పైబడిన ఉద్యోగులు ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో ఉచిత చెకప్ చేయించుకోవడానికి అవకాశం కల్పించారు. ప్రస్తుతం ఈ సదుపాయం అహ్మదాబాద్, ఫరీదాబాద్, హైదరాబాద్, కోల్‌కతాలోని ESI ఆసుపత్రులలో ప్రారంభించారు.

దీంతో పాటు ఇఎస్‌ఐ ఆసుపత్రిని నిర్మించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపిందర్ యాదవ్ పాత తీర్మానాన్ని కూడా ఆమోదించారు. కార్మిక మంత్రి ఆమోదించిన తీర్మానం ప్రకారం, ప్రస్తుతం గురుగ్రామ్‌లోని మానేసర్‌లో 500 పడకలతో ESIC (ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) ఆసుపత్రిని నిర్మించనున్నారు. ప్రస్తుతం ఇక్కడ 100 పడకల ఆసుపత్రి నడుస్తోందని, దానికి బదులు 500 పడకల ఆసుపత్రిని నిర్మిస్తామన్నారు.

ప్రభుత్వం బీమా పరిధిని పెంచుతుంది..
మీడియాతో భూపీందర్ యాదవ్ మాట్లాడుతూ, “మేము ఒక పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాం. దీని కింద ప్రతి సంవత్సరం 40 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ESIC బీమా పొందిన వ్యక్తులకు (IP) ఉచిత వైద్య పరీక్షలు చేసుకునేందుకు అవకాశం కల్పించాం. దీంతో ‘ఆరోగ్య భారత్‌’ కల నెరవేరనుంది. మా దగ్గర దాదాపు 35 కోట్ల మంది ఇన్ పేషెంట్లు ఉన్నారు. కాబట్టి మేం ఈ కొత్త సదుపాయాన్ని ఈఎస్‌ఐ ఖాతాదారులకు అందించాం. రానున్న రోజుల్లో సామాజిక భద్రతా కోడ్ అమలుతో ఐపీల సంఖ్యను ఐదు కోట్లకు పెంచుతామని, ఈ పైలట్ ప్రాజెక్టును మరింత విస్తరింపజేస్తామని’ మంత్రి తెలియజేశారు.

ఈఎస్‌ఐసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు..
ఈఎస్‌ఐసీ కూడా తన ఆసుపత్రులను సూపర్ స్పెషాలిటీ హోదాలోకి తీసుకురావాలని కోరుతున్నామని, తద్వారా రానున్న రోజుల్లో వేరే ప్రాంతాలకు రిఫరల్స్‌ను తగ్గించవచ్చని మంత్రి చెప్పారు. చికిత్స సౌకర్యాల మెరుగుదల దృష్ట్యా ESIC లబ్ధిదారుల కోసం మొబైల్ యాప్ ‘సంతుష్ట్’ను ప్రారంభించామని తెలిపారు.

పాట్నాలోని బిహ్తా, రాజస్థాన్‌లోని అల్వార్‌లలో రెండు ఇఎస్‌ఐసీ ఆసుపత్రుల నిర్మాణం పూర్తయిందని, త్వరలో వాటిని ప్రారంభిస్తామని యాదవ్ చెప్పారు. గురుగ్రామ్ (మనేసర్)లో 500 పడకల ఇఎస్‌ఐసీ ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన యాదవ్, ఇందుకు అవసరమైన నిధులను జమ చేసేందుకు ఇఎస్‌ఐసీ ఆమోదం తెలిపిందని అన్నారు.

అనేక రాష్ట్రాల్లో కొత్త ఆసుపత్రులు..
ESIC అభ్యర్థన మేరకు, హర్యానా ప్రభుత్వం కేటాయింపు కోసం 8.7 ఎకరాల భూమిని గుర్తించింది. హెచ్‌ఎస్‌ఐఐడీసీ, మనేసర్‌లో 500 పడకల ఇఎస్‌ఐసీ హాస్పిటల్ ఏర్పాటు కోసం ఈ ప్లాట్‌ను స్వాధీనం చేసుకునే ప్రతిపాదనకు ఇఎస్‌ఐసీ శనివారం ఆమోదం తెలిపింది. 100 పడకల ఇఎస్‌ఐసీ ఆసుపత్రిని నిర్మిస్తామని చెప్పారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2 హెక్టార్ల స్థలాన్ని గుర్తించింది. 90 సంవత్సరాల పాటు భూమిని ఉచితంగా బదిలీ చేయడానికి ఆమోదం తెలిపింది. మీరట్‌లో 100 పడకల ఇఎస్‌ఐసీ ఆసుపత్రి నిర్మాణం కోసం గుర్తించిన భూమిని సేకరించే ప్రతిపాదన, ప్రక్రియను ఇఎస్‌ఐసీ శనివారం ఆమోదించింది.

Also Read: Railway Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పదో తరగతి ఉత్తీర్ణతతో రైల్వేలో ఉద్యోగాలు.. చివరి తేదీ డిసెంబర్‌ 23

Omicron: 38 దేశాలకు వ్యాపించిన ఒమిక్రాన్‌.. ఈ వేరియంట్‌ ప్రమాదమా..? ఎలాంటి లక్షణాలు ఉంటాయి..? WHO ఏమంటోంది..!