ఎయిర్‌ పోర్ట్‌ అడ్డగా జోరుగా స్మగ్లింగ్‌.. మూడు రోజుల వ్యవధిలో రూ.23 కోట్ల డ్రగ్స్‌, కిలోల కొద్దీ బంగారం సీజ్..

భారతదేశంలోకి డ్రగ్స్ అక్రమంగా రవాణా చేయాలనే పక్కా ప్రణాళికతో అతడు కొకైన్‌ గుళికలను కడుపులో దాచి తెచ్చినట్టుగా అతను ఒప్పుకున్నాడని అధికారులు వెల్లడించారు. అతన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి వైద్యుల పర్యవేక్షలో అతని కడుపు నుండి 67 గుళికలు తొలగించారు. అందులో 1,130 గ్రాముల కొకైన్ దొరికింది. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ రూ.11 లక్షల 39 వేలుగా అధికారులు పేర్కొన్నారు.

ఎయిర్‌ పోర్ట్‌ అడ్డగా జోరుగా స్మగ్లింగ్‌.. మూడు రోజుల వ్యవధిలో రూ.23 కోట్ల డ్రగ్స్‌, కిలోల కొద్దీ బంగారం సీజ్..
Arrest

Updated on: Jun 23, 2025 | 10:07 AM

ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలు, బంగారం సీజ్‌ చేశారు అధికారులు. కస్టమ్స్ విభాగం, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) సంయుక్తంగా నిర్వహించిన మూడు వేర్వేరు ఆపరేషన్లలో రూ. 23 కోట్ల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మొదటి ఆపరేషన్‌లో థాయిలాండ్ నుండి వచ్చిన ప్రయాణికులు తమ పిల్లోలో దాచిన 12 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రెండవ ఆపరేషన్‌లో ఒక విదేశీయుడి కడుపులో దాచి తెచ్చిన 67 కొకైన్ గుళికలను తొలగించారు. మూడవ ఆపరేషన్‌లో విమానాశ్రయంలో పనిచేస్తున్న ఉద్యోగుల నుంచి నాలుగున్నర కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

బ్యాంకాక్ నుంచి కొంతమంది గంజాయితో వస్తున్నట్లు కస్టమ్స్‌ అధికారులకు సమాచారం అందింది. దీని ప్రకారం శుక్రవారం బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులను కస్టమ్స్ విభాగం విమానాశ్రయంలో ఆపింది. వారి బ్యాగులో వాక్యూమ్-సీల్డ్ దిండు కవర్‌లో దాచిన హైడ్రోపోనిక్ గంజాయిని గుర్తించారు అధికారులు. నిందితులిద్దరి నుండి రూ.11 కోట్ల 88 లక్షల విలువైన 11 కిలోల 881 గ్రాముల బరువున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఇక మరో కేసులో జూన్ 19న విమానాశ్రయంలో ఐవరీ కోస్ట్ నుండి వచ్చిన డ్రగ్ స్మగ్లర్‌పై DRI చర్య తీసుకుంది. అతను సియెర్రా లియోన్ నుండి ముంబై విమానాశ్రయానికి వచ్చాడు. భారతదేశంలోకి డ్రగ్స్ అక్రమంగా రవాణా చేయాలనే పక్కా ప్రణాళికతో అతడు కొకైన్‌ గుళికలను కడుపులో దాచి తెచ్చినట్టుగా అతను ఒప్పుకున్నాడని అధికారులు వెల్లడించారు. అతన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి వైద్యుల పర్యవేక్షలో అతని కడుపు నుండి 67 గుళికలు తొలగించారు. అందులో 1,130 గ్రాముల కొకైన్ దొరికింది. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ రూ.11 లక్షల 39 వేలుగా అధికారులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులను కస్టమ్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ (AIU) అధికారులు ఆదివారం అడ్డుకున్నారు. తనిఖీల్లో భాగంగా వారిని చెక్‌ చేశారు అధికారులు. ఈ సోదాల్లో అతని జేబులో ఉంచిన సాక్స్‌లో దాచిపెట్టిన కొవ్వొత్తి కనిపించింది. దానిని కరిగించగా, 24 క్యారెట్ల బంగారు పొడి కనిపించింది. నిందితుల వద్ద నుంచి మొత్తం నాలుగు కిలోల 440 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపైనా కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..