ఢిల్లీ బీజేపీ చీఫ్ ఆదేశ్ గుప్తాకి కరోనా వైరస్ పాజిటివ్

| Edited By: Pardhasaradhi Peri

Sep 16, 2020 | 8:30 PM

ఢిల్లీ బీజేపీ చీఫ్ ఆదేశ్ గుప్తాకి  కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. గత వారం  రోజులుగా తాను క్వారంటైన్ లో ఉన్నప్పటికీ తనతో కాంటాక్ట్ లో ఉన్నవారు కరోనా టెస్టులు చేయించుకోవాలని ఆయన కోరారు..

ఢిల్లీ బీజేపీ చీఫ్ ఆదేశ్ గుప్తాకి కరోనా వైరస్ పాజిటివ్
Follow us on

ఢిల్లీ బీజేపీ చీఫ్ ఆదేశ్ గుప్తాకి  కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. గత వారం  రోజులుగా తాను క్వారంటైన్ లో ఉన్నప్పటికీ తనతో కాంటాక్ట్ లో ఉన్నవారు కరోనా టెస్టులు చేయించుకోవాలని ఆయన కోరారు.  మొదట తనకు నెగెటివ్ అని రిపోర్టు వచ్చిందని, కానీ జ్వరం కొంత పెరగడంతో మళ్ళీ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ రిపోర్టు వచ్చిందని ఆయన పేర్కొన్నారు.  ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ శిశోడియా కరోనా పాజిటివ్ కి గురైన సంగతి తెలిసిందే. ఆ మధ్య నగరంలో కరోనా వైరస్ కేసులు తగ్గినప్పటికీ ఈ వారం  రోజుల్లో కేసులు  మళ్ళీ పెరగడం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.