Corona India Updates: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 46,268 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 81,37,119కు చేరింది. ఇక 24 గంటల్లో 551 మంది కరోనాతో మరణించగా.. మృతుల సంఖ్య 1,21,641కు చేరింది. 74,32,829 మంది కరోనాను జయించగా.. ప్రస్తుతం దేశంలో 5,82,649 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇక 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 10,67,976 శాంపిల్స్ని పరీక్షించగా.. మొత్తం టెస్ట్ల సంఖ్య 10,87,96,064కు చేరింది.
Read More:
IPL 2020: మరోసారి ‘బుట్ట బొమ్మ’కు వార్నర్ స్టెప్పులు
IPL 2020: గేల్ ‘సెంచరీ’ మిస్.. ఆర్చర్ పాత ట్వీట్ వైరల్