Vaccination: మూడు రాష్ట్రాల ఎన్నికలు.. వంద కోట్ల టీకా డోసులు.. బీజేపీ విజయోత్సవ ప్రచార ప్రణాళికలు!

|

Oct 14, 2021 | 12:06 PM

దేశంలో 96.75 కోట్లకు పైగా వ్యాక్సిన్ మోతాదులు ఇప్పటివరకూ ఇచ్చారు. వచ్చే వారం 100 కోట్ల వ్యాక్సిన్ మార్క్ దాటుతుందని భావిస్తున్నారు.

Vaccination: మూడు రాష్ట్రాల ఎన్నికలు.. వంద కోట్ల టీకా డోసులు.. బీజేపీ విజయోత్సవ ప్రచార ప్రణాళికలు!
Vaccination In India
Follow us on

Vaccination:  దేశంలో 96.75 కోట్లకు పైగా వ్యాక్సిన్ మోతాదులు ఇప్పటివరకూ ఇచ్చారు. వచ్చే వారం 100 కోట్ల వ్యాక్సిన్ మార్క్ దాటుతుందని భావిస్తున్నారు. అంటువ్యాధికి వ్యతిరేకంగా దీనిని తన పెద్ద విజయంగా చూపించడానికి ఇప్పటి నుండి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. మెగా విస్తరణ ప్రణాళికలో భాగంగా, బీజేపీ తన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జాతీయ, రాష్ట్ర అధికారులను టీకా కార్యక్రమానికి హాజరు కావాలని కోరింది. ప్రత్యేకించి వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలలో బీజేపీ ఈ విస్తరణ కార్యక్రమం అమలు చేస్తుంది. ఈ రాష్ట్రాలలో ఉత్తర ప్రదేశ్, గుజరాత్, పంజాబ్ ఉన్నాయి.

దసరా తర్వాత టీకా వేగాన్ని వేగవంతం చేయడానికి ప్లాన్..

అందుతున్న సమాచారం  ప్రకారం, సోమవారం లేదా మంగళవారం నాటికి 100 కోట్ల వ్యాక్సిన్ మోతాదులు పూర్తవుతాయని అంచనా. నవరాత్రి, దుర్గా పూజ కారణంగా, టీకాలు వేసే ప్రక్రియ కొంచెం మందగించింది. ఇప్పుడు ప్రభుత్వం దసరా తర్వాత టీకాలను వేగవంతం చేయాలని యోచిస్తోంది. తద్వారా 100 కోట్ల సంఖ్యను త్వరలో చేరుకోవచ్చు.

బీజేపీ నాయకులు వైద్యులు, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలను సత్కరిస్తారు. బీజేపీ నాయకులు, మంత్రులు, ఎంపిలు వ్యాక్సిన్‌లు వేసిన టీకా కేంద్రాలను సందర్శిస్తారు. అక్కడ వైద్యులు, ఆరోగ్య సంరక్షణ కార్మికులను సత్కరిస్తారు. కరోనాకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయంగా 100 కోట్ల టీకాల సాధన చూపబడుతుంది.

కేంద్ర ప్రభుత్వ ఇతర ప్రజా సంక్షేమ పథకాల గురించి తెలియజేయడానికి పార్టీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటుంది. ఈ కార్యక్రమాల ఫోటోలు, వీడియోలను పంచుకోవాలని, మీడియా కవరేజ్ వివరాలను కూడా సమర్పించాలని పార్టీ నాయకులకు సూచించింది.

అక్టోబర్ 2 న , కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా దేశంలో 90 కోట్ల మోతాదులో కరోనా వ్యాక్సిన్ గురించి తెలియజేశారు. లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్-జై కిసాన్ నినాదాన్ని ఇచ్చారని, అటల్ జీ దానికి జై విజ్ఞానాన్ని జోడించారని, ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ జై అనుసన్ధన్ నినాదాన్ని ఇచ్చారని ఆయన ట్వీట్ చేశారు. కరోనా టీకా ఈ పరిశోధన ఫలితం అని ఆయన పేర్కొన్నారు.

కాగా, బుధవారం (13.10.2021) సాయంత్రం వరకు దాదాపు 96.7 కోట్ల మోతాదులు వ్యాక్సిన్ భారత్ లో ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉండగా భారత్ లో 15,823 తాజా కరోనావైరస్ కేసులు నమోదు అయ్యాయి. సంక్రమణ సంఖ్య 3,40,01,743 కి చేరుకుంది. జాతీయ కోవిడ్ రికవరీ రేటు 98.06 శాతానికి పెరిగింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం ఈ (14.10.2021) ఉదయం 8 గంటల వరకు 226 కొత్త మరణాలతో మరణాల సంఖ్య 4,51,189 కి చేరుకుంది.

కొత్త కరోనావైరస్ ఇన్ఫెక్షన్ల రోజువారీ పెరుగుదల వరుసగా 19 రోజుల పాటు 30,000 కంటే తక్కువగా ఉంది. ఇప్పుడు వరుసగా 108 రోజులుగా 50,000 కంటే తక్కువ రోజువారీ కొత్త కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 2,07,653 కు తగ్గిపోయాయి. మొత్తం ఇన్ఫెక్షన్లలో 0.61 శాతం ఉన్నాయి. జాతీయ కోవిడ్ రికవరీ రేటు 98.06 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

భారతదేశంలో కోవిడ్ -19 సంఖ్య 2020 ఆగస్టు 7 న 20 లక్షలు, ఆగస్టు 23 న 30 లక్షలు, సెప్టెంబర్ 5 న 40 లక్షలు, సెప్టెంబర్ 16 న 50 లక్షలు దాటింది. ఇది సెప్టెంబర్ 28 న 60 లక్షలు, అక్టోబర్ 11 న 70 లక్షలు దాటింది. అక్టోబర్ 29 న 80 లక్షలు, నవంబర్ 20 న 90 లక్షలు దాటింది అదేవిధంగా డిసెంబర్ 19 న ఒక కోటి మార్కును అధిగమించింది. మే 4 న భారతదేశం రెండు కోట్ల భయంకరమైన మైలురాయిని దాటింది. జూన్ 23 న మూడు కోట్లు దాటింది.

ఇవి కూడా చదవండి: IOCL Recruitment: ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో అప్రెంటిస్‌ ఖాళీలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

Maa Elections 2021: మా ఎన్నికలల్లో మరో ట్విస్ట్‌.. బాలకృష్ణ ఇంటికి మంచు విష్ణు.. అసలేం జరుగుతోంది.