లదాఖ్ లో మళ్ళీ చైనా నిర్మాణాలు.. స్పష్టంగా చూపుతున్న శాటిలైట్ ఇమేజీలు

| Edited By: Pardhasaradhi Peri

Jun 24, 2020 | 6:50 PM

తూర్పు లడాఖ్ ప్రాంతంలోని దౌలత్ బేగ్ ఓల్డీ డెప్సాంగ్ సెక్టార్లలో చైనా దళాల అనుమానాస్పద కదలికలు , నిర్మాణాలను, ఆర్టిల్లరీ శకటాలను కొత్త శాటిలైట్ ఇమేజీలు చూపుతున్నాయి. అక్కడ వారి క్యాంపులు, ఇతర శకటాలను గుర్తించారు. ఈ నిర్మాణాలతో బాటు చైనా సైనికులు కూడా ఈ ఇమేజీల్లో కనబడడం విశేషం. నియంత్రణ రేఖకు దారి తీసే ప్రాంతాల్లో షెల్టర్లు, టెంట్లు కూడా గోచరిస్తున్నాయని మాజీ మేజర్ జనరల్ రమేష్ పాధీ పేర్కొన్నారు, ‘పెట్రోల్ పాయింట్-14’ వద్ద చైనా […]

లదాఖ్ లో మళ్ళీ చైనా నిర్మాణాలు.. స్పష్టంగా చూపుతున్న శాటిలైట్ ఇమేజీలు
Follow us on

తూర్పు లడాఖ్ ప్రాంతంలోని దౌలత్ బేగ్ ఓల్డీ డెప్సాంగ్ సెక్టార్లలో చైనా దళాల అనుమానాస్పద కదలికలు , నిర్మాణాలను, ఆర్టిల్లరీ శకటాలను కొత్త శాటిలైట్ ఇమేజీలు చూపుతున్నాయి. అక్కడ వారి క్యాంపులు, ఇతర శకటాలను గుర్తించారు. ఈ నిర్మాణాలతో బాటు చైనా సైనికులు కూడా ఈ ఇమేజీల్లో కనబడడం విశేషం. నియంత్రణ రేఖకు దారి తీసే ప్రాంతాల్లో షెల్టర్లు, టెంట్లు కూడా గోచరిస్తున్నాయని మాజీ మేజర్ జనరల్ రమేష్ పాధీ పేర్కొన్నారు, ‘పెట్రోల్ పాయింట్-14’ వద్ద చైనా చొరబాటు కనిపిస్తోందన్నారు. ఆ ప్రాంతంలో భారీ సంఖ్యలో తరలిస్తున్న బుల్ డోజర్లు, ఇతర వాహనాలను చూస్తుంటే ఆ చోట తిష్ట వేయడానికో, ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికో చైనా దళాలు ప్రయత్నిస్తున్నట్టు అనుమానించాల్సివస్తోందన్నారు. 2013 లో డెప్సాంగ్  సెక్టార్ లో చాలా భూభాగాన్ని డ్రాగన్ కంట్రీ ఆక్రమించుకుంది. ఓవైపు  బుధవారంఇండియా-చైనా బోర్డర్ వ్యవహారాలపై గల కమిటీ భారత-చైనా దేశాల మధ్య ఉద్రిక్తతల నివారణకు చర్చలు జరుపుతుండగా.. మరోవైపు చైనా ఏకపక్ష దూకుడు చర్యలతో ఆందోళనను రేకెత్తిస్తోంది.