PM Modi: ప్రధాని మోదీతో బెంగాల్ సీఎం మమతా ముఖాముఖి సమావేశం.. ఎందుకు కలుస్తున్నారో తెలుసా..

ఆగస్టులో జరుగనున్న ఈ 'మెగా' మీటింగ్ గురించి జాతీయ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పార్థ ఛటర్జీ ఘటనపై పశ్చిమ బెంగాల్ ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో ప్రధాని మోదీతో బెంగాల్ సీఎం మమతా ప్రత్యేకంగా సమావేశం..

PM Modi: ప్రధాని మోదీతో బెంగాల్ సీఎం మమతా ముఖాముఖి సమావేశం.. ఎందుకు కలుస్తున్నారో తెలుసా..
Mamata Banerjee to meet PM Narendra Modi

Updated on: Jul 27, 2022 | 4:42 PM

ఉప్పు-నిప్పుగా ఉన్న రెండు పార్టీ అగ్రనేతలు కలుసుకోబోతున్నారు. అందులోనూ వ్యక్తిగతంగా సమావేశం కానున్నారు. ఆగస్టులో జరుగనున్న ఈ ‘మెగా’ మీటింగ్ గురించి జాతీయ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పార్థ ఛటర్జీ ఘటనపై పశ్చిమ బెంగాల్ ఉక్కిరిబిక్కిరి అవుతుండగా.. అందులో ఇడి పాత్రపై రాజకీయ నిపుణులు, రాబోయే ప్రధాని మోదీ-మమతా బెనర్జీ భేటీకి భిన్నమైన ప్రాధాన్యత సంతరించుకోనుందని అంటున్నారు. ‘కోర్టులో చట్టం ఏం తీర్పునిస్తుందో తమ పార్టీ అంగీకరిస్తుందని.. ఎంతటి కఠిన శిక్ష విధించినా విచారణలో జోక్యం చేసుకోబోమని.. ఎవరికైనా జీవిత ఖైదు విధించినా అభ్యంతరం లేదు’ అని టీఎంసీ అధినేత్రి మమతా మంగళవారం కామెంట్ చేశారు.

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగస్టు 7న జరిగే నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి హాజరయ్యేందుకు న్యూఢిల్లీకి రానున్నారు. రాజకీయ వర్గాలు ఈ అవకాశం గురించి తెలియజేశాయి. జీఎస్‌టీపై వివాదాలు, కేంద్ర-రాష్ట్ర సంబంధాల్లో ఉద్రిక్తత నేపథ్యంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం కానున్నారు. మమతా బెనర్జీ ఢిల్లీకి ఎప్పుడు వస్తారనేది మాత్రం ఇంత వరకు ఫిక్స్ కాలేదు.. కానీ, ఆగస్టు 6వ తేదీ నాటికి దీదీ ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉంది. అయితే,ప్రధాని నరేంద్ర మోదీని ఆయన నివాసంలో ప్రత్యేకంగా కలుస్తారా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే ఆమె సమావేశానికి హాజరైతే మాత్రం రాష్ట్రపతి భవన్‌లో మోదీని కలుస్తారు.

గత ఏడాది ఈ కౌన్సిల్ వర్చువల్ సమావేశానికి మమత హాజరు కాలేదు. అంతకు ముందు, 2019లో ప్రధానమంత్రితో జరిగిన చివరి ముఖాముఖి సమావేశానికి కూడా మమత డుమ్మా కొట్టారు. ఈ నీతి ఆయోగ్ సమావేశంలో ఏమీ చేయలేదని ఆమె వాదించారు. ఈసారి మమత వస్తే ముఖ్యమంత్రి పదవికి దూరమవుతారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మే నెలలో న్యాయవ్యవస్థపై జరిగిన సమావేశంలో న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన హై టీ వేడుకలో మాత్రం ప్రధాని మోదీ, మమత సమావేశమయ్యారు. ఇక గతేడాది నవంబర్‌లో ప్రపంచ బెంగాల్ వాణిజ్య సదస్సుకు ప్రధానిని ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి ఢిల్లీకి వచ్చి ప్రధానితో సమావేశం అయ్యారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us