దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ తన సత్తా చాటింది. వరుసగా మూడు సార్లు గెలిచి.. హ్యాట్రిక్ నమోదు చేసుకుంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 62 స్థానాల్లో గెలిచి.. తిరుగులేని పార్టీగా అవతరించింది. ఈ క్రమంలో అరవింద్ కేజ్రీవాల్కు దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా.. ఘన విజయం సాధించిన అరవింద్ కేజ్రీవాల్కు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు కాంగ్రాట్స్. ఇంతకుముందు ప్రజా సేవలో ఎలా ముందుకు వెళ్లారో.. ఇప్పుడు కూడా ధృడసంకల్పంతో ప్రజాసేవలో నిలుస్తారని ఆశిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
Heartfelt congratulations to Sri @ArvindKejriwal Ji on winning the #DelhiPolls2020. I am sure you will continue to serve the people of Delhi with the same dedication as earlier.
— N Chandrababu Naidu (@ncbn) February 11, 2020
మరోవైపు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కూడా కేజ్రీవాల్కు శుభాకాంక్షలు తెలిపారు. అద్భుతమైన విజయం సాధించి.. హ్యాట్రిక్ కొట్టినందుకు శుభాకాంక్షలు అంటూ తన అధికారిక ట్విట్టర్ ద్వారా కేజ్రీవాల్కు శుభాకాంక్షలు తెలిపారు.
Many congratulations to Sri @ArvindKejriwal Ji on an impressive hattrick victory ?
— KTR (@KTRTRS) February 11, 2020