సుశాంత్ కేసులో సీబీఐ దర్యాప్తు దాదాపు పూర్తి అయింది. త్వరలో తన ఫైనల్ రిపోర్టును పాట్నాలోని సీబీఐ కోర్టుకు సమర్పించనుంది. సుశాంత్ మృతిలో అనుమానించదగినదేమీ లేదని. ఇది ఆత్మహత్యేనని అభిప్రాయపడిన సీబీఐ.. ఈ కేసులో ప్రధానంగా రియా చక్రవర్తిపై వఛ్చిన ఆరోపణల మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపే సూచనలున్నాయి. సుశాంత్ ని సూసైడ్ కి ఎవరైనా ప్రేరేపించారా అన్నదానిపై కార్యాచరణ ప్రణాళికతో ఈ సంస్థ ముందుకు వెళ్లనుందని తెలుస్తోంది. కాగా-తనపై తప్పుడు వాంగ్మూలమిచ్చిన పొరుగింటి మహిళపై చర్యలు తీసుకోవాలని రియా చక్రవర్తి.. సీబీఐని కోరింది. (రియా బెయిలుపై విడుదలయింది.)