Pune: ఒక్కసారిగా కూలిపోయిన బ్రిడ్జ్.. 15 మంది గల్లంతు..!

మహారాష్ట్రలోని పుణెలో ఇంద్రయాణి నదిపై ఉన్న పురాతన వంతెన కుప్పకూలింది. దీంతో ఆ ఘటనలో సుమారు 15 మంది పర్యాటకులు నదిలో పడి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్స్ ఘటనాస్థలికి చేరుకుని సహాయకచర్యలు ప్రారంభించాయి. ఆరుగురిని స్థానికులు రక్షించినట్లు సమాచారం. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు వంతెన డ్యామేజ్ అయినట్లు సమాచారం.

Pune: ఒక్కసారిగా కూలిపోయిన బ్రిడ్జ్.. 15 మంది గల్లంతు..!
Bridge Collapse

Updated on: Jun 15, 2025 | 5:01 PM

పుణే జిల్లాలో విషాదకర ఘటన వెలుగుచూసింది. ఇంద్రాయణి నదిపై ఉన్న పురాతన బ్రిడ్జి కూలిపోయిన ఘటనలో పలువురు పర్యాటకులు గల్లంతైనట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటన ఆదివారం కుండమాల ప్రాంతంలో చోటుచేసుకుంది. వర్షాకాలంలో పర్యాటకులతో కిటకిటలాడే ఈ ప్రాంతంలో ప్రమాదం సంభవించింది. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

మావల్ తాలూకాలోని కుందమల ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. వర్షాకాలంలో ప్రతిరోజూ వందలాది మంది పర్యాటకులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు. కుందమల చేరుకోవడానికి ఇంద్రాయణి నదిపై ఒక పురాతన వంతెన ఉంది. అది అకస్మాత్తుగా కూలిపోవడంతో.. వంతెనపై ఉన్న 10 నుంచి 15 మంది నదిలో పడిపోయారు. కొంతమంది పర్యాటకులు నదిలో మునిగిపోయినట్లు సమాచారం. కొంతమందిని స్థానికులు రక్షించారు.

ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఎంత మంది కొట్టుకుపోయారే ఖచ్చితంగా తెలియదు. అధికారులు వివరాలు తెలపాల్సి ఉంది. 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..