AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాఫియా స్టైల్ దోపిడీ.. రూ.400 కోట్లతో వెళ్తున్న కంటైనర్లు హైజాక్

బెళగావి సరిహద్దులో రూ.400 కోట్ల కంటైనర్ల భారీ దోపిడీ సంచలనం సృష్టించింది. గోవా నుండి మహారాష్ట్రకు తరలిస్తున్న డబ్బు రియల్ ఎస్టేట్ వ్యాపారి కిషోర్ షెట్‌కు చెందినది. ఈ కేసు కర్ణాటక, గోవా, మహారాష్ట్ర పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. సందీప్ పాటిల్ కిడ్నాప్ తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటుకు ఆదేశించారు.

మాఫియా స్టైల్ దోపిడీ.. రూ.400 కోట్లతో వెళ్తున్న కంటైనర్లు హైజాక్
Containers Carrying Rs 400 Crore Hijacked
Jyothi Gadda
|

Updated on: Jan 25, 2026 | 3:52 PM

Share

కర్ణాటక రాష్ట్రం బెళగావి జిల్లా సరిహద్దు ప్రాంతంలో జరిగిన అతిపెద్ద దోపిడీ కేసు సంచలనం సృష్టిస్తోంది. గోవా నుండి మహారాష్ట్రకు రూ.400 కోట్లు తరలిస్తున్న 2 కంటైనర్లు హైజాక్ అయినట్లు చెబుతున్నారు. 2025 అక్టోబర్ 16న జరిగిన దేశంలోనే అతిపెద్ద దోపిడీ కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసు ఇప్పుడు కర్ణాటక, గోవా, మహారాష్ట్ర అనే మూడు రాష్ట్రాల పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. ఈ కేసుకు సంబంధించి నాసిక్ పోలీసులు నలుగురిని అరెస్టు చేసినట్టుగా సమాచారం. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టుగా తెలిసింది.

బెళగావి-గోవా సరిహద్దులోని చోర్లా ఘాట్ నుండి రూ.400 కోట్లతో కూడిన 2 కంటైనర్లు అదృశ్యమైనట్లు వెల్లడైంది. ఈ సంఘటన జరిగి దాదాపు నెల రోజుల తర్వాత దోపిడీ కేసు వెలుగులోకి రావడం మూడు రాష్ట్రాల పోలీసులను షాక్‌కు గురిచేసింది. ఇది అనేక అనుమానాలకు కూడా దారితీసింది. బెళగావిలో జరిగిన ఈ అతిపెద్ద దోపిడీ మహారాష్ట్రలో సంచలనం సృష్టించింది. కర్ణాటక, మహారాష్ట్ర, గోవా పోలీసులు కంటైనర్ల కోసం గాలిస్తున్నారు.. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దర్యాప్తు కోసం ఒక SITని ఏర్పాటు చేసి, ఉత్తర్వులు జారీ చేశారు. దొంగిలించబడిన భారీ మొత్తం డబ్బు మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపారి కిషోర్ షెట్‌కు చెందినదని చెబుతున్నారు.

దోపిడీ కేసు ఎందుకు బయటపడింది..?

ఇవి కూడా చదవండి

నాసిక్ కు చెందిన సందీప్ పాటిల్ కిడ్నాప్ తర్వాత ఈ కేసు వెలుగులోకి వచ్చింది. కంటైనర్లు దొంగిలించబడిన తర్వాత, మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపారి కిషోర్ శెట్ సహచరులు సందీప్ పాటిల్ ను తుపాకీతో కిడ్నాప్ చేశారు. వారు అతన్ని బందీగా ఉంచి నెలన్నర పాటు హింసించారని చెబుతున్నారు. కంటైనర్ హైజాక్ కు తానే కారణమని చెబుతూ సందీప్ ను హింసించారని చెబుతున్నారు. రూ.400 కోట్లు చెల్లించకపోతే చంపేస్తామని కూడా బెదిరించారు. కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్న తర్వాత, సందీప్ నాసిక్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. రూ.400 కోట్ల విలువైన వాహనాన్ని హైజాక్ చేసినట్లు సందీప్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సందీప్ ఫిర్యాదు ఆధారంగా నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు మిగతా ఇద్దరి కోసం వెతుకుతున్నారు. ఆ ఇద్దరి అరెస్టు తర్వాతే కంటైనర్ హైజాక్ కేసు సుఖాంతం అయ్యే అవకాశం ఉంది.

సమగ్ర దర్యాప్తునకు ఫడ్నవీస్ ఆదేశం

ఈ దోపిడీ కేసును మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. రూ.400 కోట్లతో కూడిన కంటైనర్‌ను కనిపెట్టే కేసును సిట్‌కు అప్పగించారు. ఈ కేసు దర్యాప్తును మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సిట్‌ను ఆదేశించారు. మరోవైపు, కేసు దర్యాప్తులో సహకరించాలని బెళగావి ఎస్పీ రామరాజన్‌కు లేఖ కూడా రాశారు. మరోవైపు, మహారాష్ట్ర ప్రభుత్వం గోవా పోలీసుల సహకారాన్ని కూడా కోరిందని చెబుతున్నారు. ఈ డబ్బును ఇటీవల మహారాష్ట్రలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఉపయోగించే అవకాశం ఉందని చెబుతున్నారు. అందువల్ల, ఫడ్నవీస్ అన్ని కోణాల నుండి దర్యాప్తుకు ఆదేశించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us