Assembly Election Results 2026 LIVE: మరికాసేపట్లో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్.. ఫలితాలపై ఉత్కంఠ..
5 State Assembly Election Results 2026 LIVE Counting and Updates in Telugu: దేశం మొత్తం ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్తో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా? లేక ప్రజల నాడి మరేదైనా ఉందా? అనే ఆసక్తిగా మారింది.

LIVE NEWS & UPDATES
-
West Bengal Results: రాత్రి నుంచే పలుచోట్ల హైటెన్షన్
- బెంగాల్లో రాత్రి నుంచే పలుచోట్ల హైటెన్షన్
- స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర సెక్యూరిటీపై మమత అనుమానాలు
- టీఎంసీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపు
- అనుమానాస్పద ఘటనలపై వెంటనే ఫిర్యాదులు చేయాలని సూచన
- CCTV ఫుటేజ్ తప్పనిసరిగా డిమాండ్ చేయాలని ఆదేశం
- బీజేపీ కుట్రలు చేస్తోందంటూ ఆరోపిస్తున్న సీఎం మమత
-
Exit Polls Results: ఆసక్తికరంగా ఎగ్జిట్ పోల్స్
- ఐదు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
- తమిళనాడులో డీఎంకేకే పట్టం కట్టిన ఎగ్జిట్ పోల్స్
- బెంగాల్లో కాషాయ జెండా ఎగురుతుందన్న సర్వేలు
- కేరళలో కాంగ్రెస్, అస్సాంలో బీజేపీ గెలుస్తాయని అంచనాలు
-
-
కేరళపై గట్టి ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్
- కేరళపై గట్టి ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్
- కేరళలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలు
- ఓట్ల లెక్కింపుకు 140 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు
- మ్యాజిక్ ఫిగర్ 71 సీట్లు కాగా..ఈసారి 78 శాతానికి పైగా ఓటింగ్
- కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టిన ఎగ్జిట్ పోల్స్
-
తమిళనాడు ఫలితాలపై ఉత్కంఠ
- తమిళనాడు ఫలితాలపై ఉత్కంఠ
- తమిళనాడులో అసెంబ్లీ స్థానాలు 234
- కౌంటింగ్ కోసం 62 సెంటర్లు ఏర్పాటు
- పవర్ను చేజిక్కించుకోవాలంటే కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118
- ఈ సారి తమిళనాట రికార్డు స్థాయిలో 85శాతానికి పైగా పోలింగ్
-
దేశం చూపు బెంగాల్పైనే..
- దేశం మొత్తం చూపు బెంగాల్పైనే..
- పశ్చిమ బెంగాల్లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 294
- ఈ సారి ఎన్నికల్లో 93 శాతం ఓటింగ్ నమోదు
- అధికారం చేపట్టడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 148
- కౌంటింగ్ కోసం 77 సెంటర్లు ఏర్పాటు
- బీజేపీకే పట్టం కట్టిన ఎగ్జిట్ పోల్స్
-
-
కాసేపట్లో కౌంటింగ్..
- కాసేపట్లో 5 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
- 8 గంటలకు ప్రారంభంకానున్న ఓట్ల లెక్కింపు
- బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఫలితాలపై ఉత్కంఠ
- మొదట పోస్టల్ బ్యాలెట్లు.. తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు
- ఉదయం పదికల్లా ట్రెండ్.. మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టత
- బెంగాల్, తమిళనాడు, కేరళ వైపే అందరి చూపు
మరికాసేపట్లో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. ఉదయం 10 గంటల కల్లా ట్రెండ్ తెరపైకి రానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను ఆ తరువాత ఈవీఎం ఓట్లను లెక్కిస్తారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉంటే కౌంటింగ్ కోసం 62 సెంటర్లను ఏర్పాటు చేశారు. పవర్ను చేజిక్కించుకోవాలంటే కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118. ఈసారి తమిళనాట రికార్డు స్థాయిలో 85శాతానికి పైగా పోలింగ్ జరిగింది. భారీ ఓటింగ్ ఎవరికి ప్లస్ ? ఎవరికి మైనస్? అనే చర్చ జరుగుతోంది. తమిళనాడ DMK మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందా? సూపర్ స్టార్ విజయ్ TVK పార్టీ పవర్ను పుల్ చేస్తుందా? అనేది ఆసక్తిగా మారింది.
ఇక పశ్చిమ బెంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించారు. 93 శాతం ఓటింగ్ నమోదయింది. అధికారం చేపట్టడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 148. కౌంటింగ్ కోసం 77 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈసారి మళ్లీ టీఎంసీనే పగ్గాలు చేజిక్కించుకుంటుందా? లేదంటే బీజేపీ పాగా వేయబోతుందా?ఈసారి బెంగాల్ టైగర్ ఎవరన్నది ఉత్కంఠ రేపుతోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బీజేపీకి ఎడ్జ్నిచ్చాయి. ఐతే పక్కా లెక్క ఏంటో మరికాసేపట్లో తేలనుంది.
ఇక కేరళలో కేరళలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఓట్ల లెక్కింపుకు 140 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. మ్యాజిక్ ఫిగర్ 71. ఈసారి 78 శాతానికి పైగా ఓటింగ్ జరిగింది. పినరయి విజయన్ మళ్లీ సర్కార్ ఏర్పాటు చేస్తారా? UDF పవర్లోకి వస్తుందా? కమలానికి ఈసారి కలిసివస్తుందా?. కేరళలో ఏం జరగబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. 126 అసెంబ్లీ స్థానాలున్న అసోంలో ఈసారి 85శాతానికి పైగా పోలింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపుకు 40 కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. మ్యాజిక్ ఫిగర్ 64. మళ్లీ బీజేపీ సర్కార్ వస్తుందని సర్వే సంకేతాలిచ్చాయి. సర్వే అంచనాలే నిజమవుతాయా? లేదంటే లెక్క మారుతుందా? అనేది మరికాసేపట్లో తేలనుంది. పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఈ సారి 90 శాతం పోలింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపు 6 కేంద్రాల్లో జరుగుతుంది. మళ్లీ తామే పవర్లోకి రావడం ఖాయమని బీజేపీ నేతలు ధీమాగా ఉన్నారు.
Published On - May 04,2026 6:34 AM




