ఉమ్ ఫున్ తుఫాను.. బెంగాల్ కకావికలం.. లక్ష కోట్ల నష్టం

| Edited By: Pardhasaradhi Peri

May 21, 2020 | 11:21 AM

ఉమ్ ఫున్ తుఫాను ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని కకావికకలం చేసింది. ఒడిషాతో పోలిస్తే ఈ రాష్ట్రంలో ఈ తుఫాను మిగిల్చిన విషాదం ఇంతాఅంతా కాదు. కరోనా వైరస్ కన్నా ఇది మరింత తీవ్రమైనదని సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇప్పటికే లక్ష కోట్ల నష్ట వాటిల్లిందని ఆమె తెలిపారు. ఈ మహా విపత్తు ధాటికి 12 మంది మరణించారని,  ఇళ్ళు  కోల్పోయి  నిరాశయులైన 5 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని ఆమె తెలిపారు. […]

ఉమ్ ఫున్ తుఫాను.. బెంగాల్ కకావికలం.. లక్ష కోట్ల నష్టం
Follow us on

ఉమ్ ఫున్ తుఫాను ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని కకావికకలం చేసింది. ఒడిషాతో పోలిస్తే ఈ రాష్ట్రంలో ఈ తుఫాను మిగిల్చిన విషాదం ఇంతాఅంతా కాదు. కరోనా వైరస్ కన్నా ఇది మరింత తీవ్రమైనదని సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇప్పటికే లక్ష కోట్ల నష్ట వాటిల్లిందని ఆమె తెలిపారు. ఈ మహా విపత్తు ధాటికి 12 మంది మరణించారని,  ఇళ్ళు  కోల్పోయి  నిరాశయులైన 5 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని ఆమె తెలిపారు. వేలాది భవనాలు, ఇళ్ళు ధ్వంసమయ్యాయని, ఈ నష్టాల నుంచి కోలుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేమని  మమత అన్నారు. కోల్ కతా విమానాశ్రయం వర్షపు నీటితో నిండిపోగా అనేక స్ట్రక్చర్లు ధ్వంసమయ్యాయి. భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. వాహనాలకు వాహనాలే దెబ్బ తిన్నాయి. గంటకు 185 కి.మీ. వేగంతో వీచిన పెనుగాలులకు రాష్ట్రం చిగురుటాకులా వణికిపోయింది. అయితే  పశ్చిమ బెంగాల్ తో  పోలిస్తే ఒడిశాలో ఈ తుఫాను మిగిల్చిన నష్టం అంతగా లేదని నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ పేర్కొంది. ఇది క్రమంగా బలహీనపడి వాయుగుండంగా మారుతోందని ఈ సంస్థ వెల్లడించింది.