Pravasi Gujarati Parv 2022: అహ్మదాబాద్‌లో ఘనంగా ప్రవాసీ గుజరాతీ పర్వ్ – 2022 వేడుకలు.. హాజరైన అమిత్ షా..

|

Oct 15, 2022 | 1:44 PM

ప్రవాసీ గుజరాతీ పర్వ్ – 2022 వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అహ్మదాబాద్ నగరంలో మూడు రోజుల పాటు ఈ వేడుకలు అత్యంత వైభంగా జరుగనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న..

Pravasi Gujarati Parv 2022: అహ్మదాబాద్‌లో ఘనంగా ప్రవాసీ గుజరాతీ పర్వ్ - 2022 వేడుకలు.. హాజరైన అమిత్ షా..
Union Minister Amit Shah
Follow us on

ప్రవాసీ గుజరాతీ పర్వ్ – 2022 వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అహ్మదాబాద్ నగరంలో మూడు రోజుల పాటు ఈ వేడుకలు అత్యంత వైభంగా జరుగనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గుజరాతీలను ఒక్కటి చేయాలనే ఉద్దేశంతో ఏటా ప్రవాసీ గుజరాతీ పర్వ్ నిర్వహిస్తున్నారు. అదానీ ప్రెసెంట్స్ ప్రవాసీ గుజరాతీ పర్వ్ – 2022 పవర్డ్ బై ఎమ్ఈఐఎల్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మొత్తం 3రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న గుజరాతీ ప్రముఖులతో పాటు 20కిపైగా దేశాల్లో ఉన్న గుజరాతీలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సెటిల్ అయిన గుజరాతీలను ఏకం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఈవెంట్ ఆర్గనైజర్స్ తెలిపారు. టీవీ9 నెట్ వర్క్, AIANA తీసుకున్న చొరవ ద్వారా ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. టీవీ9 నెట్‌వర్క్ సీఈవో బరున్ దాస్.. హోం మంత్రి అమిత్‌షా తో పాటు పలువురు కీలక వ్యక్తుల ప్రసంగం ఉంటుంది. శనివారం ఉదయం 11:45కి హోమం మంత్రి అమిత్ షా ప్రసంగం ఉంటుంది. ఇక 15, 16, 17 తేదీల్లో జరిగే ఈ వేడుకల్లో పలువురు ప్రముఖుల ప్రసంగాలు కూడా ఉంటాయి. అలాగే, ఈ వేడుకలకు హాజరయ్యే ప్రముఖలను నిర్వాహకులు సన్మానించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..