ఎయిమ్స్ నుంచి అమిత్ షా డిశ్చార్జ్
కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సోమవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ఢిల్లీలోని ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సోమవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ఢిల్లీలోని ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, డిశ్చార్జ్ చేస్తున్నామని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. పోస్ట్ కోవిడ్ అనంతరం అమిత్ షా ఆగస్టు 18 న ఎయిమ్స్ లో చేరారు. స్వల్ప అస్వస్థత కారణంగా చేరిన ఆయనను డాక్టర్ల బృందం అబ్జర్వేషన్ లో ఉంచి ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తూ వచ్చింది. అటు-హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన అమిత్ షా ఓనం పండుగ సందర్భంగా కేరళీయులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు.