AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shri Krishna Janmabhoomi Case: శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై అలహాబాద్ హైకోర్టు సంలచన తీర్పు.. స్థలాల సర్వేకు ఆమోదం

ఉత్తరప్రదేశ్ మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం, షాహీ ఈద్గా మసీదు మధ్య వివాదంపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. హైకోర్టు తన తీర్పులో వివాదాస్పద స్థలాలను సర్వే చేయాలని ఆదేశించింది. వివాదాస్పద భూమిని అడ్వకేట్ కమిషనర్ ద్వారా సర్వే చేయించాలన్న డిమాండ్‌ను కూడా కోర్టు ఆమోదించింది.

Shri Krishna Janmabhoomi Case: శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై అలహాబాద్ హైకోర్టు సంలచన తీర్పు.. స్థలాల సర్వేకు ఆమోదం
Sri Krishna Janmabhoomi Dispute
Balaraju Goud
|

Updated on: Dec 14, 2023 | 2:55 PM

Share

ఉత్తరప్రదేశ్ మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం, షాహీ ఈద్గా మసీదు మధ్య వివాదంపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. హైకోర్టు తన తీర్పులో వివాదాస్పద స్థలాలను సర్వే చేయాలని ఆదేశించింది. వివాదాస్పద భూమిని అడ్వకేట్ కమిషనర్ ద్వారా సర్వే చేయించాలన్న డిమాండ్‌ను కూడా కోర్టు ఆమోదించింది.

అలహాబాద్ హైకోర్టు గురువారం తీర్పు వెలువరిస్తూ, హిందూ పక్షం పిటిషన్‌ను ఆమోదించింది. ఈ కేసులో జస్టిస్ మయాంక్ కుమార్ జైన్‌తో కూడిన సింగిల్ బెంచ్ మధ్యాహ్నం 2 గంటలకు తీర్పు వెలువరించింది. తన నిర్ణయంలో, జ్ఞాన్వాపి వివాదం తరహాలో, న్యాయస్థానం న్యాయవాది కమీషనర్ ద్వారా మథురలోని వివాదాస్పద స్థలాల సర్వేను కూడా నిర్వహించాలని ఆదేశించింది.

న్యాయవాదులు హరిశంకర్ జైన్, విష్ణు శంకర్ జైన్, ప్రభాష్ పాండే, దేవకీ నందన్ ద్వారా లార్డ్ శ్రీ కృష్ణ విరాజ్‌మన్ సహా మరో ఏడుగురు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఇందులో కృష్ణుడి జన్మస్థలం ఆ మసీదు క్రింద ఉందని, మసీదు హిందూ దేవాలయమని నిరూపించే అనేక సంకేతాలు ఉన్నాయని పేర్కొన్నారు. హిందూ తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ ప్రకారం, హిందూ దేవాలయాల లక్షణం, హిందూ దేవతలలో ఒకటైన శేషనాగ్ ప్రతిరూపమైన తామరపువ్వు ఆకారంలో స్తంభం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

నిర్ణీత గడువులోగా సర్వే అనంతరం నివేదిక సమర్పించేందుకు నిర్దిష్ట సూచనలతో కమిషన్‌ను ఏర్పాటు చేయాలని పిటిషనర్లు కోరారు. ఈ మొత్తం ప్రక్రియ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీని నిర్వహించాలని అభ్యర్థించారు. మధుర కోర్టులో పెండింగ్‌లో ఉన్న శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు వివాదానికి సంబంధించిన అన్ని కేసులను అలహాబాద్ హైకోర్టు ఈ ఏడాది మేలో బదిలీ చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…